Posts

Showing posts from 2020

Dasara navaratri puja vidhanam

Image
 🌸🍃🌸🍃🌸🍃🌸 🍃🌸🍃🌸🍃🌸🍃 *🕉️శరన్నవరాత్రులు,పూజ విధానం🕉️* 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 ముందు రోజే పీఠాన్ని సిద్ధం చేసుకోవాలి, కొందరు అమ్మవారి ప్రతిమను , కొందరు ఫోటోను, కొందరు  పసుపు గోధుమ పిండితో కలిపిన 9 అమ్మవారి రూపాలను, దీనితో పాటు కళాశాన్ని.. ప్రతిష్ట చేస్తారు..ఎవరి అలవాటు ప్రకారం వారు ప్రతిష్ట చేసుకోవాలి.. కొందరు అమ్మవారి ప్రతిష్ట తో పాటు ఒక కుండలో నవధాన్యాలు వేసి ఉంచుతారు తొమ్మిదవ రోజుకి అవి బాగా మొలకలు వచ్చి పెరుగుతుంది అది శుభ సూచకంగా భావిస్తారు. కొందరికి బొమ్మల కొలువు ఆనవాయితీగా పెడతారు వారు ముందురోజే సిద్ధం చేసుకోవాలి బొమ్మల కొలువు పెట్టేవాళ్ళు కళశాన్ని స్థాపన చేయాలి. వచ్చే ప్రతి ముత్తైదువులకు పసుపుకుంకుమ ఇచ్చి పంపాలి   వారు ఏ సమయంలో వచ్చినా.. ఇవ్వాలి కొలువై ఉన్న దేవతలుగా భావించాలి.. కుమారి పూజ: కుమారి పూజ 9 సంవత్సరాలు లోపు బాలికలకే చేయాలి.. 🕉️ఉపవాసం: ఆరోగ్యం బాగలేని వారు ఉపవాసం చేయడం దోషం , పూజ అయ్యాక ఆల్ఫాహారం తీసుకోవచ్చు..అన్నం తినడం ఇష్టం లేకపోతే పిండి తో చేసిన పదార్థాలు ఆల్ఫాహారం లాంటిది తినవచ్చు..ఇంక ఉపవాసం ఉండే వారు సాయంత్రం పూజ తర్వాత తినవచ్చు..కఠినంగా ఉపవాస దీక్ష ఉండే

Simple remedy for pitru dosha

 పితృ దోషము నుండి బయటపడే సులువైన పరిష్కారం " పితృ దోషం' ... మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా అనుభవించటానికి మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో ... అలాగే...  తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి. మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది. అలాగే అదే పూర్వికులు పాపాలు గనుక చేసి ఉంటే అది తెలుసు కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా గాని వారు చేసిన పాప కర్మలు ఆ వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు -  మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే బాధ పడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ముఖ్యమైనది ఒక్కటే. అదే " పితృ దోషం " ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం. అందుకే ఈ పోస్టు పెడుతున్నాను. పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది. ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు. వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే. పితృదోష వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని చర్చించుకుందాము...

Nitya parayana slokalu

 💢నిత్య పారాయణ శ్లోకాలు💢 మనలో చాలామందికి తెలియని శ్లోకాలు ఏ దైవ సన్నిధిలో ఏ శ్లోకం జపించాలో తెలుసుకోండి...   🌷ప్రభాత శ్లోకం :🌷 కరాగ్రే వసతే లక్ష్మీ: కరమధ్యే సరస్వతీ ! కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ !!   ☘ప్రభాత భూమి శ్లోకం : ☘ సముద్ర వసనే దేవీ పర్వత స్తవ మండలే ! విష్ణుపత్ని సమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే !!   🌝సూర్యోదయ శ్లోకం : 🌝 బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ ! సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ !!   🍀స్నాన శ్లోకం : ☘ గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ ! నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు !!   ♨భస్మ ధారణ శ్లోకం : ♨ శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ ! లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ !!   🍀భోజనపూర్వ శ్లోకం : 🍀 బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ ! బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన: !!   అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహ - మాశ్రిత: ! ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విధమ్ !!   త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే ! గృమాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర !!   💢 భోజనానంతర శ్లోకం : 💢 అగస్త్యం వైనతేయం చ శమీం చ

Khadga mala stotram

Image
 🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️ 🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹 _*🌷పౌర్ణమి రోజు వెన్నెల పారాయణం ఎంత విశేష ఫలితాన్ని ఇస్తుందో, నవమి రోజు సాయంత్రం దేవి ఖడ్గమాల స్త్రోత్రం పారాయణం అంత ఫలితాన్నిస్తుంది పానకం పెట్టి  16 సార్లు చదవాలి🌷*_ *🌹శ్రీ దేవీ  ఖడ్గమాలా స్తోత్రం (నామావలి)🌹* 👉(ఖడ్గమాల పారాయణ చేయడం అంటే శ్రీచక్రాన్ని అర్చన చేయడం ఇలా లలితా మూల బీజాలతో సంపుటికరణ చేసి నామావలి తో అమ్మవారికి అర్చన చేయడం వల్ల ఎన్నో రకాల సమస్యలు తొలగి పోతుంది, ఉపదేశము లేని వారికి న్యాసాలు అవసరం లేదు)..అవి వదలి నామం చదవండి  హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్ | వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్ || అస్య శ్రీ శుద్ధశక్తిమాలామహామంత్రస్య, ఉపస్థేంద్రియాధిష్ఠాయీ వరుణాదిత్య ఋషయః దేవీ గాయత్రీ ఛందః సాత్విక కకారభట్టారకపీఠస్థిత కామేశ్వరాంకనిలయా మహాకామేశ్వరీ శ్రీ లలితా భట్టారికా దేవతా, ఐం బీజం క్లీం శక్తిః, సౌః కీలకం మమ ఖడ్గసిద్ధ్యర్థే సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః, మూలమంత్రేణ షడంగన్యాసం కుర్యాత్ | ధ్యానం ఆరక

Remedy for wealth and hapiness

Image
 🙏🙏🙏🙏🙏 ఐశ్వ‌ర్యం, ఆనందం కోసం ఏం చేయాలి? 1. ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదును ఇబ్బందులు కలుగవు. త్వరలోనే ఆర్థిక స‌మ‌స్య‌లు తీరిపోతాయి. 2. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి. 3. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి. 4. తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ, అభిమానాలను కలిగి ఉంటారు. చాల వరకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండే భయం, భీతి, బెదిరింపులన్నీ తొలగిపోతాయి. 5. తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనైశ్చరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులను పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి. 6. అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి, అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వచ్

Deepam yela pettali

Image
  🕯️✳️ఇంట్లో దీపం పెట్టెటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి? 🕯️✳️  ✳️ దీపం తేజస్ తత్వానికి ప్రతీక. రోజు రెండు సార్లు, ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి. ✳️ దీపప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండని చెప్పలేదు, దీపాన్నీ పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం. ✳️ దీపంలోనే దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు. అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీలేవు. ✳️ ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే, సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖమూ, కాళ్ళూ, చేతులు, నోరు కడుక్కుని దీపారాధన చేయాలి. మాంసాహారం తిన్నేవారు కూడా ప్రతిసారీ తలంటుస్నానం చేయనవసరంలేదు. మామూలు స్నానం సరిపోతుంది. ✳️ ఇక దీపం వెలిగించి ప్రమిద బంగారం కానీ, వెండిది కానీ, ఇత్తడిది, మట్టిదైనా అయి ఉండాలి. స్టీలు, ఇ

Udyoga samasyalaku pariskaralu

Image
 ఉద్యోగ ప్రాప్తి కొరకు "శ్రీరామ పట్టాభిషేక పారాయణ " ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగంలో ఆటంకాలు ఎదురౌతున్నవారు,  ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్న వారు,  ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారు, ఉద్యోగంలో గుర్తింపును కోరుకునేవారు,  తమస్ధాయికి తగిన ఉద్యోగం లభించాలని కోరుకునేవారు శ్రీమద్రామాయణము నందలి  శ్రీరామ పట్టాభిషేకం ప్రతిరోజు ఉదయాన్నే 21 సార్లు పఠించాలి. నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితోనఘః | రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ || ప్రహృష్టముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః | నిరాయమో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః || న పుత్రమరణం కించిద్ద్రక్ష్యంతి పురుషాః క్వ చిత్ | నార్యశ్చావిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః || న చాగ్నిజం భయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః | న వాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా || న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా | నగరాణి చ రాష్ట్రాణి ధన ధాన్యయుతాని చ || నిత్యం ప్రముదితాస్సర్వే యథా కృతయుగే తథా | అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః || గవాం కోట్యయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి | అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః || రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి ర

Ganapathi Types

Image
 🕉️🐘🕉️🐘🕉️🐘🕉️🐘🕉️🐘🕉️🐘🕉️🐘🕉️🐘🕉️🐘 *🐘🕉108 రూపాలలోని  శ్రీ గణపతి🕉️🐘* "ఓం గం గణపతియేనమః" 1. ఏకాక్షర గణపతి.💐  ప్రాతర్భజామ్య్భయదం ఖలు భక్త శోకదావానలం గణ్విభుంవర  కుంజరాస్యమ్ అజ్ఞాన కానన వినాశన హవ్యవాహం ఉత్సాహ వర్ధనమహం సుతమీశ్వరస్య! 2. మహా గణపతి.💐 భిభ్రాణోబ్జక బీజాపూరక కదా దంతేక్షు బాణైస్సమం భిభ్రాణో మణికుంభశాలి కణిశం పాశంచ వక్ర్తాంచితం గౌరంగ్యారుచి రారవిందయుతయా దేవ్యాసనాధాంతిక: శోణాంగ శ్శుభమాతనోతుభవతాం నిత్యం గణేశో  మహాన్  3. బాల గణపతి.💐 కరస్ధ కదళీచూత పనసేక్షు కపిత్ధకం బాలసూర్యప్రభందేవం వందే బాలగణాధిపం 4. తరుణ గణపతి.💐 పాశాంకుశాపూస కపిత్ధ జంబూ ఫలం తిలాం చేక్షు మపిసవ హసై: ధత్తే సదాయ స్తరుణారుణాంభ: పాయాత్సయుష్మాన్ తరుణో గణేశ: 5. విఘ్నరాజ గణపతి.💐 విఘ్నరాజావతారశ్చ శేషవాహన ఉచ్చతే  మమతాసుర సంహర్తా విష్ణు బ్రహ్మేతివాచక: 6. సిద్ది గణపతి.💐 ఏకదంతం చతుర్హస్తం పాశాంకుశ ధారిణమ్ అభయంచవరదం హసైర్ద దానమూషకధ్వజమ్ 7. బుద్ధి గణపతి.💐 త్రయీమయాఖిలం బుద్ధిధాత్రే బుద్ధి ప్రదీపాయ సురాధిపాయ | నిత్యాయ సత్యాయచ నిత్యబుద్ధే నిత్యం నిరీహాయ నమోస్తు నిత్యమ్ ||  8. లక్ష్మీ గణపతి.💐 బిభ్రాణశ్శ

Durga Stotram

  ............................................ *దుర్గా దుర్గార్తి శమనీ దుర్గాపద్వినివారిణీ* *దుర్గమచ్ఛేదినీ దుర్గసాధినీ దుర్గనాశినీ* *ఓం దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా* *ఓం దుర్గమజ్ఞానదా దుర్గ దైత్య లోక దవానలా* *ఓం దుర్గ మాదుర్గమాలోకా దుర్గమాత్మ స్వరూపిణీ* *ఓం దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా* *ఓం దుర్గమ జ్ఞాన సంస్థానా దుర్గమ ధ్యాన భాసినీ* *ఓం దుర్గ మోహాదుర్గ మాదుర్గమార్ధ స్వరూపిణీ* *ఓం దుర్గ మాసుర సంహంర్త్రీ దుర్గమాయుధధారిణీ* *ఓం దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమాదుర్గమేశ్వరీ* *ఓం దుర్గభీమా దుర్గభామా దుర్లభా దుర్గ దారిణీ* *నామావళి మిమాం యస్తు దుర్గాయా మమ మానవః* *పఠేత్సర్వ భయాన్ముక్తో భవిష్యతి నసంశయః*  ...................................... *ఎవరైనా అమితమైన కష్టాలను*  *అనుభవిస్తున్నారనుకున్న వారికి ఈ స్తోత్రాన్ని ఇవ్వగలరు.* *ఈ శ్లోకం చాలా శక్తిమంతమయిన శ్లోకం.  దుర్గాదేవికి సంభందించిన 32 నామాలు ఇందులో ఉన్నాయి .  ఈ శ్లోకం దుర్గాసప్తసతి లో కనిపిస్తుంది . ఈ శ్లోకాన్ని ఎవరు  రోజూ చదువుతారో వారు అన్ని భయాలనుంచీ కష్ఠాలనుంచీ  విముక్తులవుతారు.*

Manchi Vishayalu

  *ఉత్తమ విషయాలు*. పిల్లలకు పుట్టు వెంట్రుకలు ‘9 ‘ వ నెలలో కాని, ’11 ‘వ నెలలో కాని, ‘3 ‘వ సంవత్సరంలో కాని తీయవలెను. పిల్లలకు అన్నప్రాసన ఆడ పిల్లలకు ‘5 ‘ వ నెలలో,  మగ పిల్లలకు ‘6 ‘ వ నెలలో అన్న ప్రాసన చేయాలి.  6 నెల 6వ రోజున ఇద్దరికీ పనికివస్తుంది.  *పంచామృతం, పంచగవ్యములు* ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, వీటిని పంచామృతం అని,ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రము, వీటిని పంచగవ్యములు అంటారు. *ద్వారం  ప్రాముఖ్యం* ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపము, అందుకే దానికి మామిడి తోరణం కడతారు.  క్రింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు. శాస్ర పరంగా చెప్పాలంటే గడప కు పసుపు రాయడం వల్ల క్రిమి కీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా. తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు. తొలితీర్థము శరీర శుద్ధికి,శుచికి… రెండవ తీర్ధం ధర్మ,న్యాయ ప్రవర్తనకు … మూడవ తీర్ధం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదము కొరకు. *తీర్థ మంత్రం* అకాల మ్రుత్యుహరణం సర్వవ్యాది నివారణం సమస్త పాప శమనం విశ్నుపాదోధకం శుభం . *స్నానము ఎలా చేయ వలెను* నది లో ప్రవహమునకు ఎదురుగ పురుషులు,  వాలుగ స్త్రీలు చేయ

Rushi Panchami - Sapta Rushulu

 #ఋషి_పంచమి: భాద్రపద శుద్ధ పంచమి ని  #ఋషి_పంచమి: గా వ్యవహరిస్తారు... ఈ రోజున అత్రి,  కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ట, జమదగ్ని,  విశ్వామిత్ర  మహర్షుల గురించి ఒక్కసారైనా తలచుకోవాలని చెబుతారు పెద్దలు. అరణ్యవాసం లో సీతారాములకు అభయమిచ్చిన వాడు అత్రి మహర్షి... సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు.    సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినవాడు భరద్వాజ మహర్షి.  తన భార్య అహల్య ద్వారా రామునికి తన తప:ఫలాన్ని అందింపజేసిన మహారుషి గౌతముడు. రాముని గురువు విశ్వామిత్రుడు. కుల గురువు వశిష్టుడు విష్ణువు అంశావతారమైన పరశురాముని కన్న తండ్రి  జమదగ్ని మహర్షి. దశావతారాల్లో ఒకటైన వామనుడి జనకుడు కశ్యప మహర్షి. #ఋషి_పంచమి నాడు రామాయణం చదివితే ఈ మహర్షులందరినీ తలుచుకున్నట్టే.  #ఋషి_పంచమి వైశిష్ట్యం: ఋషి పంచమి వ్రతము ను స్త్రీలు తప్పక ఆచరించాలి . వినాయక చవితి మరుసటి రోజు వచ్చే పంచమిని " #ఋషి_పంచమి " అంటారు . సప్త ఋషులు ఆరోజు తూర్పున ఉదయిస్తారు . బ్రహ్మ విద్య నేర్వవలసిన రోజు . సప్తఋషుల కిరణాలు ఈ రోజు సాధకులపై ప్రసరిస్తాయి . . .  గనుక బ్రాహ్మీ ముహూర్తముననే లేచి ధ్యానం చేసుకోవాలి . సప్తఋషులే గాయత్రీ మ

108 Temples around Draksharamam

Image
ద్రాక్షారామ చుట్టుపక్కల అనేక శివాలయాలు దేవీమందిరాలు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే. ఆ ఆలయాలన్నిటిని ఆకాశమార్గాన చూస్తే అన్ని కలిపి ఒక పద్మాకారం లో వుంటాయి. ఈ ఆలయాల గురించి బహుళ ప్రాచుర్యం లేనందున చాల మందికి ఈ ఆలయాల గురించిన అవగాహన లేదు. విశేషమేమిటంటే, ప్రతి వ్యక్తి 27 నక్షత్రాలు లో ఉన్న 108 పాదాలలో ఏదో ఒక దానిలో జన్మిస్తారు. ప్రతి నక్షత్రానికి దానికి సంబంధించిన ప్రతి పాదానికి సంబంధించి ప్రత్యేకమైన ఆలయం ఉంటుంది గ్రహదోష నివారణ కోసం అభిషేకాలు చేయ దలుచుకున్న వారికి ఆ ప్రత్యేకమైన ఆలయంలో మొదట నామ నక్షత్రము, లేదా జన్మనక్షత్రానికి తరువాత రాశికి సంబంధించిన లింగ ఆరాధన చేసి చివరకు ద్రాక్షారామం దర్శించుకుంటే ఫలితం ఉంటుందట . మేషరాశి నుండి మీనరాశి వరకు అదే క్రమంలో ఆరాధించ వలసిన ఆలయాల సమాచారం. ★★★★★★★★★★★★★★★★★★ మేష రాశి💝■■■■■■■■ మేషరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామం భీమేశ్వర స్వామి వారి ఆలయానికి తూర్పున విలాసగంగావరంలో వుంది. అశ్విని నక్షత్రం💝 పాదం ----------స్థలం -------- దేవీ దేవతల నామాలు మొదటి★---------బ్రహ్మపురి-------శ్రీశ్రీశ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి రెండవ★ ------- - ఉట్రుమిల్లి -

Sukthulu vati arthalu

✍ మన సనాతనధర్మ  సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు 🕉 మనం తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు తెలుసుకోవాలని అనిపించడం సహజం కదా! ముందుగా మనం తరుచుగా వినే మూల వాక్యాలు ఇవీ: 👉 *ధర్మో రక్షతి రక్షిత:* 👉 *సత్య మేవ జయతే* 👉 *అహింసా పరమో2ధర్మ:* 👉 *ధనం మూలమిదం జగత్* 👉 *జననీ జన్మ భూమిశ్చ* 👉 *స్వర్గాదపి గరీయసి* 👉 *కృషితో నాస్తి దుర్భిక్షమ్* 👉 *బ్రాహ్మణానా మనేకత్వం* 👉 *యథా రాజా తథా ప్రజా* 👉 *పుస్తకం వనితా విత్తం* 👉 *పర హస్తం గతం గత:* 👉 *శత శ్లోకేన పండిత:* 👉 *శతం విహాయ భోక్తవ్యం* 👉 *అతి సర్వత్ర వర్జయేత్* 👉 *బుద్ధి: కర్మానుసారిణీ* 👉 *వినాశ కాలే విపరీత బుద్ధి:* 👉 *భార్యా రూప వతీ శత్రు:* 👉 *స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:* 👉 *వృద్ధ నారీ పతి వ్రతా* 👉 *అతి వినయం ధూర్త లక్షణమ్* 👉 *ఆలస్యం అమృతం విషమ్* 👉 *దండం దశ గుణం భవేత్* 👉 *ఇవీ మన చెవిని పడుతూ ఉండే మూల వాక్యాలు. కదా?* *ఇప్పుడు వీటి పూర్తి పాఠాలు చూదామా ?* ధర్మ ఏవో హతో హంతి "ధర్మో రక్షతి రక్షిత:" తస్మా ధర్మో న హంతవ్యో మానో ధర్మో హ్రతోవ్రధీత్ 🔥ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే , అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్ష

Homas and its uses

Image
హోమాలు అంటే ఏంటీ..?  ముఖ్య హోమాలు వాటి ప్రయోజనాలు ..... గణపతి హోమం :- విఘ్నాలను తొలగించే విఘ్ననాయకుడు గణపతి. మానవులు ప్రారంభించే ప్రతి కార్యాల్లోనూ మొదటగా గణపతిని పూజించడం జరుగుతుంది. ప్రారంభించిన కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుతూ వినాయకుడిని పూజిస్తారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ప్రతికూల అంశాలను తొలగించడానికి వినాయకుడికి గణపతి హోమం నిర్వహిస్తాము. ఈ గణపతి హోమం చేయడం వలన విజయము, ఆరోగ్యము, సంపద కార్య సిద్ధి కలుగుతాయి. హిందూ ధర్మం ప్రకారం ఏ శుభకార్యం చేయాలన్నా మొదటగా గణపతి హోమంతోనే ప్రారంభించడం జరుగుతుంది. ఈ గణపతి హోమానికి అష్ట ద్రవ్యలు/ 8 రకాలు. దర్భ మొదలగునవి ఉపయోగించడం జరుగుతుంది. రుద్ర హోమం:-పురాణ కథలను అనుసరించి రుద్ర అనునది శివునికి మరొక నామము. శివుడు లేదా రుద్రుని అనుగ్రహం కొరకు చేసే హోమాన్ని రుద్రహోమము అంటారు. ఈ హోమం చేయుట వలన శివుని అనుగ్రహం పొంది తద్వారా అపమృత్యు భయాలు తొలగింపబడి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొంది శక్తి సంపన్నులు అవుతారు. దీర్ఘాయుష్షుని పొందడం జరుగుతుంది. మృత్యువు మీద విజయాన్ని సాధించడానికి కూడా ఈ రుద్ర హోమం చేస్తారు. ఏ వ్యక్తి