హోమము వలన కలుగు లాభములు

 


హోమము వలన కలుగు లాభములు


హోమ ధూమము కంటి ని కప్పుట వలన కంటి లో ఉన్న నలతలన్నీ కన్నీటి రూపము లో వెళ్లి పోతుంది. 


హోమాగ్ని సెగ మోకాళ్ళ కు తాకటం వలన మోకాళ్ళ నొప్పులు రాకుండా నివారించు కోవచ్చు. 


గ్రహాలకు వేరు వేరు వృక్షాల సమిధల తో హోమం చేస్తే వేరు వేరు సత్ఫలితాలు వస్తాయి.


రవి:- తెల్ల జిల్లేడు వాత,కఫ వ్యాదులను తగ్గిస్తుంది. తెల్ల జిల్లేడు సమిధల తో ఇంట్లో హోమం చేస్తే వాస్తుదోషాలు నివారణ అవుతాయి. 


కళ్ళ కు సంబంధించిన అనారోగ్యాలు నయ మవుతాయి. 


కోపము యొక్క తాపము తగ్గుతుంది. 


తల నొప్పి భాధలు ఉండవు. 


ఆయుర్వేదం ప్రకారం తెల్ల జిల్లేడు కు  కుష్టు వ్యాధి ని నయం చేసే శక్తి వుందని ఆయుర్వేద వైద్యులు చెప్పేవారు.


చంద్రుడు:- మోదుగ సమిధల తో హోమం చేస్తే మానసిక సమస్యలు ఉండవు. 


ఆలోచనా విధానం లో మార్పులు వస్తాయి. 


సుఖ వ్యాధులు దరి చేరవు. 


మోదుగాకు ను మెత్త గా నూరి పాలతో తాగిన స్త్రీలకు ఋతు సంబంధ సమస్యలు, గర్భ సంబంధ సమస్యలు ఉండవు. 


మోదుగ పువ్వులు, గింజలు ఎండ బెట్టి నీటి లో ఒక పావు చెంచా వేసి కాగబెట్టు కొని తాగితే లావుగా ఉన్న వారు సన్న గా అవుతారు.


వైద్య పరం గా చూస్తే జీర్ణ వ్యవస్థ ను అద్భుతం గా పునరుజ్జీవింప చేసే శక్తి మోదుగ కు వుంది. 


రక్తాన్ని శుభ్ర పరుస్తుంది అని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతూ వుంటారు.


కుజుడు:- చండ్ర సమిధ తో హోమం చేస్తే ఎర్ర రక్త కణాల ఇబ్బందులు, ఎముకల బలహీనత ఇబ్బందులను అరి కడుతుందంటారు. 


పచ్చి పోక చెక్కలు కషాయం పెట్టి సేవిస్తే మధుమేహం, కోప స్వభావాలు తగ్గుతాయని చెబుతారు.


బుధుడు:- ఉత్తరేణి సమిధ ను హోమం లో ఉపయోగిస్తే చర్మ వ్యాదులు తగ్గుతాయి. 


జీర్ణ సంబంధ సమస్యలు ఉండవు. 


ఉత్తరేణి పూల్ల తో గాని, వేరు తో గాని రోజూ దంత ధావనం చేసుకుంటే దంత దోషాలు తొలగి పోతాయి. 


ఉత్తరేణి ఆకులు,గింజలు పొగ వేసి పీలిస్తే దీర్ఘ కాలం గా ఉన్న దగ్గు,జలుబు,ఆయాసం తగ్గుతాయి అన్నది విజ్ఞుల వాక్కు.


గురువు:- రావి సమిధల తో హోమం చేస్తే సంతాన ప్రాప్తి జరుగుతున్దంటారు. 


ఈ ధూమము శరీరము లో చేరి భార్యా భర్తల దోషములను తగ్గించు తుందని చెబుతారు.


రావి చెక్క కషాయాన్ని తేనె లో కలిపి తీసు కుంటే వాత రక్త దోషాలు తగ్గుతాయి.


నోటి పూత పోతుంది. 


రావి చెక్క కషాయాన్ని రోజు తీసు కుంటే ఆహారం త్వర గా జీర్ణం అవుతుంది. 


కాలేయ సమస్యలు ఉండవు. 


వివిధ కఫ దోషాలను రూపు మాపు తుందని ఆయుర్వేదం లో వుంది.


శుక్రుడు:- మేడి చెట్టు సమిధల తో హోమం చేస్తే వివాహ సమస్యలు, వైవాహిక సంబంద సమస్యలు ఉండవు. 


గురు దత్తాత్రేయుల వారికి అత్యంత ప్రీతికర మైన వృక్షం ఔదుంబర వృక్షం (మేడి చెట్టు). 


దత్తాత్రేయుల వారు ఎల్లప్పుడు సుక్ష్మ రూపం లో సుప్రతిష్టితులై ఈ వృక్ష మూలము నందు ఉంటారని అంటారు. 


దీని కాయలు, చెట్టు మొదలు నుండి తీసిన రసం వాడితే మధు మేహ వ్యాధి నివారించ బడుతుంది అని వైద్య శాస్త్రమున చెప్పబడినది. 


దీని విత్తనాలు పొడి చేసి, తేనె తో కలిపి తీసుకున్నా మధుమేహం దరి దాపుల్లో కనిపించ కుండా పోతుందంటారు.


శని:- జమ్మి సమిధల తో హోమం చేస్తే అప మృత్యు భయం తొలగి పోతుందని శాస్త్ర వచనము. 


దీర్ఘ కాల అనారోగ్యాలు తొలగిపోతాయి. 


జమ్మి చెట్టు గాలి శరీరాని కి కలిగిన ఇబ్బందులు తొలగించు తుంది. 


ప్రతి రోజు శమీ వృక్షానికి ప్రదక్షిణ చేసినచో దీర్ఘ కాల అస్వస్థతలు తొలగిపోతాయి.


రాహువు:- గరికల తో హోమం చేస్తే ఇంటి లో నర దృష్టి తొలగి పోయి సర్ప సంబంద దోషాలు తొలగిపోతాయి. 


గరిక రసాన్ని గజ్జి,చర్మం పైన ఉన్న కురుపుల పై పెట్టిన ఎడల చర్మ రోగాలు నివారించ బడతాయి. 


దెబ్బ తగిలి రక్తం కారి పోతుంటే గరిక రసాన్ని పిండితే రక్తం ఆగి పోతుంది.


కేతువు:- ధర్భల తో హోమం చేస్తే కాల సర్ప దోషాలు తొలగిపోతాయి. 


మూర్ఛ రోగాలను తగ్గిస్తుంది.


         🌹శుభమస్తు🌹


🙏సర్వే జనా సుఖినోభవంతు🙏

Comments

Please follow, Like, Comment and share

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

101 గ్రామ దేవతల పేర్లు

108 శక్తి పీఠాలు:

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

శనీశ్వరుడు గురించి తెలుసుకుందాం, శని భాదల నుండి విముక్తులం అవుదాం

సంస్కారాలు - ముహూర్తములు

సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు

_*ఉండ్రాళ్ళతద్ది నోము గురించి తెలుసు కుందాం రండి*_

వరలక్ష్మి వ్రతం