Posts

Showing posts from 2019

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

**            మనం  నిత్యం భోజనం చేసేటపుడు., కొన్ని అలవాట్లు మనకే తెలియక అలవాటుగా చేస్తూ వుంటాము. అవి అలవాట్లు కాదట. మన యొక్క నైజo అనగా మన గుణ గణాల ప్రతిబింబాలని పాక శాస్త్రం చెబుతూoది. చూద్దాము.         మనము, మన గుణాలు ఎంత వరకు సరిపోతాయో, మనకు  మనమే గమనించు కోవాలి. అలాగే ఎదుటి వారిని మనము అంచనా వేసు కోవచ్చు. భోజనం చేసేటపుడు, మన ఆహారం ఎలా తీసు కొంతున్నామో చూడండి. ఇతరుల లో గమనించండి.  వారి నడవడికను, గుణ గణాలు  తెలుకోనండి. *ఎవరైతే* :----- 1. చేతి వ్రేళ్ళు కలపక, విడివిగా ఆహారం తింటూ వ్రేళ్ళ మధ్య జార విడుస్తుంటారో వారి వద్ద డబ్బు నిలవదట.  2. అన్నాన్ని పిసికి పిసికి తినే వారి భార్య అతని వల్ల జీవితాంతం భాధ పడుతుందట. అతని మనస్సు క్రూరము, దయా దాక్షిణ్యాలు లేనివాడట. అలాంటి వాడికి మన ఆడకూతురును ఇవ్వ కూడదట. 3. చేతి వ్రేళ్ళకు,  తినేది  విడి విడి గా అతుక్కుని వుంటే వాడు దరిద్రుడట. 4. ఎవరైతే వ్రేళ్ళు మొత్తం నోట్లో పెట్టుకొని జుర్రుకుంటూ తింటారో, వారి వద్ద డబ్బు నిలవదట. పైపెచ్చు బహు పిసినారులట. 5. తినునపుడు, ఎవరైతే అరచేతిని నాకుతూ తిoటాడో, వాడు మిత్రద్రోహి, నమ్మక ద్రోహం చేసే గుణము

Grahanam - Darbhalu గ్రహణం-దర్భలు

దర్భల మీద 1982-83 ప్రాంతంలొ భారతదేశంలొ సూర్య గ్రహణం రోజున పరిశొధన జరిగింది.గరిక గడ్డి జాతికి చెందినది.అది నిటారుగా పైకి నిలబడి,సూర్యరశ్మి ద్వారా మొత్తం సూర్యశక్తిని గ్రహించి తనలొ దాచి ఉంచుకుంటుంది.అతినీలలొహిత కిరణాలను,గ్రహణ సమయంలొ భూమికి వచ్చే హానికరమైన కిరణాలను తన శక్తితొ అడ్డుకుంటుందని ఆ పరిశొధన ఫలితాలను అన్ని ప్రధాన దిన పత్రికల్లొ ప్రచురించడం జరిగింది సూర్య గ్రహణం లేదా చంద్రగ్రహణం సమయంలో గరికను ఆహార పదార్థాల్లో, ధాన్యాల్లో వేసి వుంచడం మనం గమనిస్తుంటాం. అయితే గరికను గ్రహణం సమయంలో ధాన్యాలు, ఆహార పదార్థాలకు చెందిన పాత్రలపై ఎందుకు ఉంచుతారనేది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. గ్రహణం సమయంలో భూమి మీదకు ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల్లాంటివి ఎక్కువగా ప్రసరించే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో ఈ పని చేయకూడదని, ఆహార పదార్థాలు ముట్టకూడదని పెద్దలు అంటారు. దాదాపు అన్ని ఆలయాలు మూసివేస్తారు. గ్రహణం విడిచాక ఆలయాలన్నీ... గృహాలన్నీ సంప్రోక్షణ చేయడానికి గల కారణాలు కూడా ఆ కిరణాల విషప్రభావాన్ని తొలగిస్తాయి. ఈ క్రమంలో దర్భలను కూడా ఆహార పదార్థాలు, ధాన్యాల్లో ఉంచుతారు. గరిక అనేది యాంటీ రేడియేషన్ గుణాలు

Aacharam - Aadharam ఆచారం - ఆథారం

ఆడవారు ఋతుక్రమంలో ఉన్నప్పుడు వేరుగా, అంటే ఏమీ ముట్టుకోకుండా ఉండాలంటారు. ఎందుచేత? అది ఆడవారిలో సహజంగా జరుగు శరీర మార్పే కదా! మరి అలా వేరుగా ఉంచటమనేది ఆరోగ్యపరంగా మన పెద్దలు పెట్టిన ఆచారమా? లేక దైవ సంబంధంగా దోషమని పెట్టినారా? ఆ సమయంలో దేవాలయాలకు కూడా వెళ్ళకూడదు, దైవ సంబంధ కార్యక్రమాలలో పాల్గొనకూడదు అంటారు ఎందువలన? నిజంగా అది చాలా దోషమా? ఈ స్పీడు యుగంలో ఆవిధంగా ఇంట్లోకి రాకుండా వేరుగా  ఉండడం అనేది కష్టసాధ్యం కదా? కనుక దయచేసి నా సందేహము నివృత్తి చేయవలసినదిగా కోరుచున్నాను. దేవుడు అంతటా ఉన్నాడు కదా మరి ‘వేరుగా’ ఉండడం వంటి అశౌచాలు ఎందుకు పాటించాలి? అసలు వేదాల్లో వీటికి ఆధారముందా? ఇది అనాగరికం కాదా? వివరంగా సమాధానమివ్వండి. ఈవిషయంలో అనేకమంది అనేక విధాలుగా ప్రశ్నిస్తున్నారు. కొందరు వీటికి వేదాధారం ఉందా? కల్పితమా? అని కూడా అడుగుతున్నారు. అన్నిటికీ కలిపి మీ ప్రశ్నను ఆధారంగా సమాధానమిచ్చేందుకు ప్రయత్నిస్తాం. మానవుల ఇహపర సౌఖ్యం కోసం సూక్ష్మ విషయ దర్శనం చేసిన శాస్త్రాలు అవతరించాయి. అవి వేదాలను ఆధారం చేసుకుని ఉన్నాయి. వేదాలు అపౌరుషేయాలు. దోష శంకా కళంకాలు లేనివి. అవి మానవ సుఖ జీవనం కోసం కొన్ని ఆచారాల

Thamalapaku lo dagunna health secrets

తమలపాకులో దాగున్న హెల్త్ సీక్రెట్స్‌ తమలపాకులతో భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆధ్యాత్మిక విషయాలను పక్కన పెడితే, తాంబూల సేవనం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. తమలపాకు, తాంబూలం.. పూజలకు మాత్రమే వాడతారని మనందరికీ తెలుసు. కానీ తమలపాకు ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఎముకల దృఢత్వానికి తోడ్పడే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, సిలు తమలపాకులో పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నిత్య జీవితంలో తమలపాకును ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకుందాం.. 🌿 జలుబు చేసి చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్న సమయంలో తమలపాకును వేడిచేసి, దానిపై కొద్దిగా ఆముదాన్ని రాసి ఛాతిపై వేసి కడితే ఫలితం ఉంటుంది. 🌿 తమలపాకులోని చెవికాల్ అనే పదార్థం హానికారక బ్యాక్టీరియా పెరుగుదలను కట్టడి చేస్తుంది. ఇందులో ఉండే ఎస్సెన్షియల్ ఆయిల్ ఫంగస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. 🌿 తమలపాకు యాంటాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీని వల్ల వృద్ధాప్యపు చాయలు కనిపించవు. 🌿 చెవుల మీద తమలపాకులను వేసి కట్టుకుంటే తలలో చేరిన వాతం శాంతించి తల నొప్పి తగ్గుతుంది. తమలపాకు రసాన్ని ముక్కులో డ్రాప్స్‌గా వేసుకుంటే తల

Sriramudu nadachina darulu శ్రీరాముడు నడచిన దారులు

Image
*శ్రీరాముడు నడచిన దారుల్లో...* శ్రీరామచరిత్రలో అతి ముఖ్యమైనదీ సుదీర్ఘమై నదీ ఆయన చేసిన వనవాసం. పితృవాక్య పరిపాలనా కర్తవ్యదీక్షా కంకణధారుడై ఆయన తన 25వ ఏట ప్రారంభించి తనకు *39* ఏళ్లు వచ్చే వరకూ వన సీమలలోనే సంచరించాడు. శ్రీరాముడు మనదేశం లో ఎంతోమందికి ఆరాధ్యదైవం కావడానికి ఆయన శూరత్వమే కాకుండా ఈ ధర్మ దీక్షయే ప్రధాన కారణం. *14* సం.ల సుదీర్ఘ కాలం లో ఆయన *అయోధ్య* లో ప్రారంభించి దక్షిణాదిన *రామేశ్వరం* వరకూ ప్రయాణంచేశాడు. ఆ తరువాత సేతు నిర్మాణం గావించి లంక లో రావణ సంహారం చేసాడు. ఇంత కాలం పాటు ఆయన ఏయేచోట్ల తిరిగాడో తెలుసు కోవాలంటే మనం కూడా ఆయన నడచిన దారుల్లోనే ప్రయాణించి ఆయన అడుగు జాడలేమైనా గుర్తించగలమేమో చూడాలి. నాతో రండి. ఆయన నడచిన దారుల్లోనే మనమూ ప్రయాణించి వద్దాము. శ్రీరాముడు తన వనవాస సమయంలో ఏఏ ప్రాంతాలలో తిరిగాడో తెలుసుకోవడానికి *డా॥.రామావతార్* గారు మొదలైన పరిశోధకులు చాలా మంది రామాయణంలో శ్రీ వాల్మీకి వర్ణనలు ఆధారంగా *అయోధ్య* నుంచి *రామేశ్వరం* వరకూ విస్త్రృతంగా పర్యటించారు. ఆయా ప్రాంతాలలో ప్రజలలో ఉండే ఐతిహ్యాలనూ ఇతర ఆధారాలను బట్టి వారు మొదట *189* ప్రాంతాలనూ తరువాత మరోక

నరసింహ మహా మృత్యుంజయ మంత్రం

ప్రతిరోజూ ఈ నరసింహ మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. జాతకరీత్యా అపమృత్యు దోషాలున్నవారు ప్రతిరోజూ జపించినా, లక్ష్మీ నరసింహ స్వామిని పూజించినా దోషం నివారింపబడి దీర్గాయుష్మంతులు అవుతారని శాస్త్రవచనం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్‌ నృసింహం భీషణం భద్రం మృత్యోర్‌ మృత్యుం నమామ్యహం నరసింహ స్వామి అంత గొప్ప రక్షణ ఇస్తారు. ఆనాడు మృత్యువు కోరలలో చిక్కుకున్న ప్రహ్లాదుడిని రక్షించినట్లుగా మనల్ని కూడా రక్షణ చేస్తారు. పిల్లల చేత ప్రతిరోజూ చేయిస్తే వారికి ఆయుష్షు చేకూరుతుంది. అద్వైత మత స్థాపకులైన శ్రీ శంకరాచార్యులవారిని రెండు సార్లు మృత్యువు నుంచి కాపాడారు స్వామివారు. ప్రతిరోజు భక్తితో నమ్మి కొలిచేవారికి కొండంత దేవుడు లక్ష్మీ నరసింహ స్వామి. Home

మానవుడు నిత్యమూ అచరించవలసిన ధర్మములు ?

*మానవుడు నిత్యమూ అచరించవలసిన ధర్మములు ?* *1. పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి?* జ. పిల్లలకు ‘9 ‘ వ నెలలో కాని, ’11 ‘వ నెలలో కాని, ‘3 ‘వ సంవత్సరం లో కాని తీయవలెను. *2. పిల్లలకు అన్నప్రాసన ఎన్నో నెలలో చేయాలి ?* జ. ఆడ పిల్లలకు ‘5 ‘ వ నెలలో, మగ పిల్లలకు ‘6 ‘ వ నెలలో అన్న ప్రాసన చేయాలి. *6 నెల 6వ రోజున ఇద్దరికీ పనికివస్తుంది.* *3 .పంచామృతం, పంచగవ్యములు అని దేనిని అంటారు   ?* జ. ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, వీటిని  పంచామృతం అని, ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రము, వీటిని పంచగవ్యములు అంటారు. *4. ద్వారానికి అంత ప్రాముక్యం ఎందుకు ఇస్తారు?* జ. ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపము, అందుకే దానికి మామిడి తోరణం కడతారు.  క్రింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు.  శాస్ర పరంగా చెప్పాలంటే గడప కు పసుపు రాయడం వల్ల క్రిమి కీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి అనుకోవచ్చు. *5. తీర్థాన్ని  మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు?* జ. తొలితీర్థము  శరీర శుద్ధికి,శుచికి…రెండవ తీర్ధం ధర్మ,న్యాయ ప్రవర్తనకు …మూడవ తీర్ధం పవిత్రమ

Karthika pournami రేపు 12/11/2019 కార్తీక పొర్ణమి

Image
రేపు కార్తీక పొర్ణమి ఏమి చేయాలి,దీపం ఏ దిక్కు ఉంచాలి,ఉపవాసము ఎలా చేయాలి.. రేపు కార్తీక పొర్ణమి సాయంత్రం 7 లోపులో పూర్తి అవుతుంది ఆ లోపులో ఇలా చేయండి.. కార్తీకమాసంలో ఉన్నవన్నీ పర్వదినాలే. అయితే ఈ పర్వదినాలన్నింటిలోకీ పర్వదినం కార్తీక పున్నమి అని చెప్పవలసి ఉంటుంది. మాసంలో మిగిలిన అన్ని రోజులూ చేసే స్నానం దానం దీపం జపం ఉపవాసం వంటివన్నీ ఒక ఎత్తు. పున్నమినాడు చేసేవన్నీ ఒక ఎత్తు. అంతటి విశిష్టత ఉంది కార్తీక పున్నమికి. కార్తీక పౌర్ణమినాడు తెల్లవారు జామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుంటారు.  రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు. కొందరు దీపాలను అరటిదొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు. మన గృహం తులసికోట ముందు మంచిది అని శాస్త్ర వచనం..  దేవాలయాల్లో సహస్ర లింగార్చ

ఏ నామాన్ని జపిస్తే ఏ ఫలితం వస్తుంది.

• శ్రీ రామ అని జపిస్తే జయం లభిస్తుంది. • కేశవ అని స్మరిస్తే అనేక నేత్ర వ్యాదులు మటుమాయం అవుతాయి. • దమోదరున్ని జపిస్తే బందముల నుంచి విముక్తి లబిస్తుంది. • నారాయణ అని స్మరిస్తే సకల సర్వ గ్రహాల దోషాలు సమశిపోతాయి. • మాధవా అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి. • ఆచ్యుతా అని స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషదంగా పనిచేస్తుంది. • నరసింహ అని స్మరిస్తే మీ శత్రువుల పై మీదే విజయం అవుతుంది, అదే నారసింహ అని స్మరిస్తే సకల భయాల నుచి విముక్తి కలుగుతుంది. • గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది. • శ్రీ లక్ష్మినారాయణ లను స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కలకలాడుతుంది. • సర్వేశ్వర అని స్మరిస్తే మనం చేపట్టిన కార్యం సత్వరమే జరుగుతుంది, విజయం కలుగుతుంది. • జగన్నాతా అని స్మరిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతత వస్తుంది. • కృష్ణ కృష్ణ అని స్మరిస్తే కష్టాలు తొలుగుతాయి. • శివ శివ అని అని స్మరిస్తే సకలమూ దరిచేరుతాయి. HOME

గ్రహ శాంతి పరిహారాలు

గ్రహ శాంతి పరిహారాలు  గ్రహాలకు సంబంధించిన వారం నాడు, మూట గట్టిన నవధాన్యాలు వేపచెట్టుకి కట్టాలి. ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యం నానబెట్టి ఆవుకు పెట్టాలి. గ్రహాలు – వివరాలు 1. సూర్యుడు - ఆదివారం ధాన్యం : గోధుమలు పుష్పం : తామర వస్త్రం : ఎర్రని రంగు గల వస్త్రం జాతి రాయి : కెంపు 2. చంద్రుడు - సోమవారం ధాన్యం : బియ్యం / వడ్లు పుష్పం : తెల్లని తామర వస్త్రం : తెల్లని వస్త్రం జాతి రత్నం : ముత్యం నైవేద్యం : పెరుగన్నం 3. కుజుడు - మంగళవారం ధాన్యం : కందిపప్పు పుష్పం : సంపంగి మరియు తామర వస్త్రం : ఎరుపు రంగు వస్త్రం జాతి రత్నం : ఎర్రని పగడం నైవేద్యం : కందిపప్పు తో కూడిన అన్నం 4. బుధుడు - బుధవారం ధాన్యం : పచ్చ పెసర పప్పు వస్త్రం : పచ్చని రంగు వస్త్రం జాతి రత్నం : పచ్చ నైవేద్యం : పెసరపప్పు తో కూడిన అన్నం 5. గురు - గురువారం ధాన్యం : వేరుసెనగ పప్పు పుష్పం : మల్లె వస్త్రం : బంగారు రంగు వస్త్రం జాతి రత్నం : పుష్య రాగం నైవేద్యం : సెనగపప్పు తో కూడిన అన్నం 6. శుక్రుడు - శుక్రవారం ధాన్యం : చిక్కుడు గింజలు పుష్పం : తెల్లని తామర వస్త్రం : తెల్లని వస్త్రం జాతి రత్నం : వజ్ర

108 శక్తి పీఠాలు:

పరమేశ్వరుడు పరాశక్తితో వీటన్నింటా సన్నిధి చేసి ఉంటాడు. వీటిని స్మరించినా, విన్నా భక్తులకు పాపాలు తొలగి ముక్తి లభిస్తుంది. అష్టోత్తర శతనామాలను జపించినా, పుస్తకాన్ని ఇంట్లో ఉంచుకున్నా దుష్టగ్రహ పీడలన్నీ తొలగిపోతాయి. శ్రాధ్ధ కాల౦లో వీటిని స్మరి౦చినయెడల పితృదేవతలు సంతృప్తి చెందుతారు. ఇవి సాక్షాత్తు ముక్తి క్షేత్రాలు. 1. వారణాసిలో విశాలాక్షి 2. ముఖనివాసం లో గౌరి ౩. నైవిశం లో లింగధారిణి 4. ప్రయాగలో లలిత 5. గంధమాదనం మీద కౌముకి 6. మానస క్షేత్రం లో కుముద 7. దక్షిణ క్షేత్రం లో విశ్వకామ 8. ఉత్తర క్షేత్రం లో విశ్వకామప్రరూపిణీ 9. గోమంతం లో గోమతి 10. మందరం లో కామచారిణీ 11. చైత్రరథం లో మదోత్కట 12. హస్తినాపురం లో జయంతి 13. కన్యాకుబ్జం లో గౌరి 14. మలయాచలం పై రంభ 15. ఏకామ్ర పీఠం లో కీర్తిమతి 16. విశ్వక్షేత్రం లో విశ్వేశ్వరి 17. పుష్కర క్షేత్రం లో పురుహూతిక 18. కేదారం లో సన్మార్గదాయిని 19. హిమాలయం లో మంద 20. గోకర్ణం లో భద్రకర్ణిక 21. స్థానేశ్వరం లో భవాని 22. బిల్వక్షేత్రం లో బిల్వపత్రిక 23. శ్రీశైలం లో మాధవి 24. భద్రేశ్వరం భద్ర 25. వరాహాశైలం మీద జయ 26. కమలాయం లో కమల 27. ర

శ్రీదత్తాత్రేయ అష్టచక్రబీజస్తోత్రము

*శ్రీ ఆదిశంకరాచార్య విరచిత* *శ్రీదత్తాత్రేయ అష్టచక్రబీజస్తోత్రము* 🕉🌞🌏🌙🌟🚩 🔥ఓంశ్రీమాత్రే నమః🔥 అద్వైతచైతన్యజాగృతి 🕉🌞🌏🌙🌟🚩 *1)దిగంబరం భస్మసుగన్ధలేపనం చక్రం త్రిశూలం డమరుం గదాం చ ।* *పద్మాసనస్థం ఋషిదేవవన్దితం దత్తాత్రేయధ్యానమభీష్టసిద్ధిదమ్ ॥* *భావం:-* *దిగంబరులు, భస్మ, సుగంధములతో అలంకరించిన దేహము కలవాడు, చక్రం,త్రిశూలం, డమరుకం,గద, ధరించినవాడు, పద్మాసనంలో విరాజమానులై ఋషులు, దేవతలతో పూజింపబడుతున్న దత్తాత్రేయుని ధ్యానించువారి అభీష్టములు సిధ్ధించును.* *2)మూలాధారే వారిజపద్మే సచతుష్కే వం శం షం సం వర్ణవిశాలైః సువిశాలైః ।* *రక్తం వర్ణం శ్రీభగవతం గణనాథం దత్తాత్రేయం శ్రీగురూమూర్తిం ప్రణతోఽస్మి ॥* *భావం:-* *మూలాధారచక్రస్థానం లో నాలుగు దళములు వున్న పద్మం వుంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తము,అహంకారములకు సంకేతం. చిక్కటి ఎరుపు వర్ణం తో కూడివున్న ఆ దళాలపై వం, శం, షం, సం అనే బీజాక్షరాలు వుంటాయి.దీనికి భగవంతుడు (అధిష్ఠాన దేవత) గణనాథుడు.శ్రీ గురుమూర్తి అయిన దత్తాత్రేయునికి నమస్కరించు చున్నాను.* *3)స్వాధిష్ఠానే షడ్దల పద్మే తనులింగే బాలాన్తైస్తద్వర్ణవిశాలైః సువిశాలైః ।* *పీతం

యజ్ఞం అంటే ఏమిటి?

Image
యజ్ఞం - ఓ పవిత్ర కార్యం 'యజ్ఞం' అనేది అనాదిగా వస్తున్న ఒక హిందూ సంప్రదాయం. వేదంలో యజ్ఞో వై విష్ణుః అని చెప్పబడింది. అనగా యజ్ఞం విష్ణు స్వరూపంగా భావించవచ్చు. ‘యజ్ఞం’ అను శబ్దం ‘యజ దేవపూజయాం’ అనుదాతువు నుంచి ఏర్పడింది. దైవపూజే యజ్ఞం. మన దేశంలో పురాణకాలం నుంచి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. యజ్ఞం అంతిమ లక్ష్యం దేవతలకు తృప్తి కలిగించడమే. వారిని మెప్పించడమే. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని (హోమం) వద్ద వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో 'వేల్చినవి' దేవతలందరికి చేరుతాయని విశ్వాసం. యజ్ఞ విధానం వైదిక యజ్ఞంలో అధ్వర్యుడు ప్రధాన అర్చకుడు. అతని అధ్వర్యంలో అన్ని యజ్ఞ కార్యక్రమాలూ జరుగుతాయి. అతనికి సహాయంగా అనేక మంది అర్చకులు, పండితులు ఉంటారు. వేద మంత్రాలు చదువుతారు. యజ్ఞంలో ఒకటి గాని అంతకంటే ఎక్కువగాని హోమాగ్నులు ఉంటాయి. ఆ అగ్నిలో నెయ్యి, పాలు, ధాన్యం వంటి అనేక సంభారాలు పోస్తుంటారు. యజ్ఞాలు కొద్ది నిముషాల నుంచి కొన్ని సంవత్సరాల వరకూ జరుగవచ్చు. యజ్ఞాల్లో భాగంగా.. అశ్వమేధ

నిమ్మకాయల దీపం

Image
రాహుకాలంలో  నిమ్మకాయల  దీపం గురించి తెలుసుకుందాం 🙏 నిమ్మకాయ దీపం అనేది కుజదోషం,కాలసర్ప దోషం, వ్యాపార, కుటుంబ, ఆర్ధిక భాదలతో సతమతం అయ్యే వారికి చక్కని తరుణోపాయం.  ఈ నిమ్మకాయ దీపారాధన వలన శక్తి స్వరుపినైన అమ్మవారు అనుగ్రహించి ఈతి భాదలను తొలగిస్తుంది. నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి పార్వతి దేవికి చాలా ఇష్టం . నిమ్మకాయలతో చేసిన దండను పార్వతి దేవికి ...గ్రామ దేవతలైన మైసమ్మ , ఎల్లమ్మ ,పోచమ్మ ,  మారెమ్మ,పెద్దమ్మ, మొదలైన శక్తి దేవి అవతారాలకు మాత్రమే వేస్తారు.గ్రామ దేవతల దేవాలయాల్లో ఈ నిమ్మకాయల దీపం వెలిగించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మహాలక్ష్మి , సరస్వతి మరియు ఇతర దేవాలయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు . ఒక వేళ వెలిగిస్తే ఆ ఇంట సంతోషం ఉండదు .సంసారం లో ఎప్పుడు గొడవలు ఉంటాయి , ఆర్ధిక వ్యవహారాల్లో నష్టం కలుగుతుంది ,భార్య భర్త , పిల్లలు ,స్నేహితులు,బంధువుల మధ్య తగాదాలు ఎక్కువ అవుతాయి. పార్వతి దేవాలయాల్లో నిమ్మకాయలతో చేసిన దీపాలను దేవి వారాలుగా పరిగిణించే  మంగళవారం,శుక్రవారాల్లో రాహుకాల సమయాలలో మాత్రమే వెలిగించాలి. మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు ...

వరలక్ష్మి వ్రతం

Image
                    *వరలక్ష్మి వ్రతం* ( *పూజా విధానం* )....!!  *శ్రీ* *వర లక్ష్మి పూజ సామగ్రి* :- పసుపు ................. 100 grms కుంకుమ ................100 grms గంధం .................... 1box విడిపూలు................ 1/2 kg పూల మాలలు ........... 6 తమలపాకులు............ 30 వక్కలు..................... 100 grms ఖర్జూరములు..............50 grms అగర్బత్తి ....................1 pack కర్పూరము.................50 grms చిల్లర పైసలు .............. Rs. 30/- ( 1Rs coins ) తెల్ల టవల్ .................1 బ్లౌస్ పీసులు .............. 2 మామిడి ఆకులు............ అరటిపండ్లు ................ 1 ఇతర రకాల పండ్లు ........ ఐదు రకాలు అమ్మవారి ఫోటోల ...................... కలశము .................... 1 కొబ్బరి కాయలు ............ 3 తెల్ల దారము లేదా నోము దారము లేదా పసుపు రాసిన కంకణం 2............ స్వీట్లు .............................. బియ్యం 2 kg కొద్దిగా పంచామృతం లేదా పాలు 100 ML  *పూజా* *సామాగ్రి* :- దీపాలు .... గంట హారతి ప్లేటు స్పూన్స్ ట్రేలు నూనె వత్తులు అగ్గిపెట్టె గ

కాల కొలమానం

తృటి =సెకండ్ లో 1000 వంతు 100 తృటులు =1 వేద 3 వేదలు=1 లవం 3 లవాలు=1 నిమేశం.రెప్ప పాటుకాలం 3 నిమేశాలు=1 క్షణం, 5 క్షణాలు=1 కష్ట 15 కష్టాలు=1 లఘువు 15 లఘువులు=1 దండం 2దండాలు=1 ముహూర్తం 2 ముహూర్తాలు=1 నాలిక 7 నాలికలు=1 యామము,ప్రహారం 4 ప్రహరాలు=ఒక పూట 2 పూటలు=1 రోజు 15 రోజులు=ఒక పక్షం 2 పక్షాలు=ఒక నెల. 2 నెలలు=ఒక ఋతువు 6 ఋతువులు=ఒక సంవత్సరం. 10 సంవత్సరలు=ఒక దశాబ్దం 10 దశాబ్దాలు=ఒక శతాబ్దం. 10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది 100 సహస్రాబ్ది=ఒక ఖర్వ..లక్ష సంవత్సరాలు 4లక్షల 32 వెల సంవత్సరాలు= కలియుగం 8లక్షల 64 వేల సంవత్సరాలు=త్రేతాయుగం 12లక్షల 96 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం 17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం.(చతుర్ యుగం) 71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం 14 మన్వంతరాలు=ఒక కల్పం 200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు 365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సర 100 బ్రహ్మ సంవత్సరాలు=బ్రహ్మసమాప్తి ఒక బ్రహ్మసమాప్తి=విష్ణుపూట మరో బ్రహ్మఉద్బవం=విష్ణువు కు మరో పూట భాగవతాదారితం 🕉🕉 HOME

చిట్టి__తంత్రాలు_పెద్ద_లాభాలు

💐💐  💐💐 2 వ వివరణ. 1.నాలుగు చిన్న మేకులు తీసుకుని నృసింహ మంత్రాన్ని చెబుతూ మీ సింహ ద్వారానికి ఇరుప్రక్కలా దించేయండి.ఎలాంటి దుష్టాత్మలు ఇంట్లోకి ప్రవేశించవు. 2.ఇంట్లోకి వచ్చేముందు ద్వారానికి ఎదురుగా చెప్పులు విడవకండి. 3.మీ పిల్లలు మాట వినడం లేదా?ఆదివారం అష్టాక్షారీ మంత్రంతో వారిపై నుండి ఒక బూరు కొబ్బరి కాయను తిప్పి కూడలిలో పారవేయండి. 4.ఇంట్లో డబ్బు నిలవకుంటే నాలుగు గచ్ఛకాయలు లక్ష్మి మంత్రాన్ని నూట ఎనిమిదిసార్లు చేసి బీరువాలో పెట్టండి. 5.ఎప్పుడూ ఏదో సమస్యతో బాధపడేవారు భైరవుని పేరుమీద కొంచెం మద్యాన్ని తీసుకొని భైరవాష్టకాన్ని చదివి తాగేవారికి ఇవ్వండి. 💐*చిట్టి తంత్రాలు*💐 1.తాంబూలంలో కొద్దిగా జాజికాయను కలిపి వేసుకోవడం ద్వారా ముఖంలో చక్కని వర్చస్సుని పొందగలరు, 2.కొన్ని తెల్ల ఆవాలు తీసుకొని భైరవమంత్రం చదువుతూ మీ యింటికి ఎనిమిది పక్కలా చల్లండి,భైరవుడు మీకు రక్షణ గా ఉంటాడు, 3.కొద్దిగా పాతబెల్లం తీసుకొని ముద్దలా చేసి పదకొండు లవంగాలు గుచ్చి నైఋతిలో పాతి పెట్టండి.ఇంటికి పీడలు తొలగిపోతాయి. 4.శుక్ర వారం రాహుకాలంలో రెండు రొట్టెలు వాటిలో కొద్దిగా బెల్లం కలిపి ఆవుకి తినిపించండి.రాహుగ

దత్త క్షేత్రములు..!!💐 దత్తావతారాలు....

Image
1శ్రీపాద శ్రీ వల్లభ స్వామి.💐 1.పిఠాపురం.💐 దత్తుని ప్రదమ దత్తావతారం శ్రీపాద శ్రీ వల్లభుడు జన్మించిన ప్రదేశం. ఆంద్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నది..                  2.కురువపురం.💐 ప్రదమ దత్తావతారులైన శ్రీపాదవల్లబులు తపసు చేసిన స్థలం... ఇది హైదరాబాదు, కర్నూలు రూటులో దేవరకొండ స్టేషను నుండి బస్ లో వెళ్ళవచ్చు. 3.గోకర్ణము.💐 ప్రదమ దత్తావతారు లైన శ్రీపాద వల్లబులు తపసు చేసిన స్థలం ... ఇది కర్నాటక రాష్ట్రము హుబ్లి నుండి బస్ లో వెళ్ళవచ్చు. దత్తావతారం..నృశింహ సరస్వతి.💐 4.కరంజా.💐 రెండవ దత్త అవతారం, నృశింహ సరస్వతి (శ్రీ గురుడు) జన్మస్థలం... ఇది మహరాష్ట్రఅమరావతి జిల్లాలో ఉన్నది 5.నర్సో బావాడిన.💐 శ్రీ గురుడు 12 సం॥తపసుచేసిన స్థలం,... ఇది కొల్హా పూర్ మీరజ్ రూటులో ఉన్నది 6.గాణగా పూర్.💐 శ్రీ గురుడు 23 సం॥ నివసించినస్థలం, ఇది కర్నాటక గుల్బర్గ వద్ద కలదు. ఇచ్చటశ్రీ గురుని నిజపాదుకలు కలవు, చూడవలసి స్థలం, బీమా అమరజా సంగమ స్నానం పరమ పవిత్రం 7.ఔదుంబర్‌.💐 శ్రీ గురుడు చాతుర్మాసం చేసిన .స్థలం. ఇది కూడ మహరాష్ట్రలో ఉన్నది.                                    8.మీరజ్.

శాఖాంభరి దేవి అలంకారాలు

Image