Posts

సంస్కారాలు - ముహూర్తములు

Image
   మానవుడు జన్మించినప్పటి నుంచి మరణించే వరకు సంష్కారమయమే. సంస్కారాల వలన జన్మాంతర దోషాలు కూడా వీడిపోయి మానవ జీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది. జీవి గర్భంలో పడింది మొదలు అంత్య సంస్కారం వరకు జరిగే సంస్కారాలు లేదా కర్మలు ధర్మశాస్త్రల్లో 40 వరకు చెప్పబడ్డాయి. గౌతమ స్మృతుల్లో 40 సంష్కారాలను, అంగీరస మహర్షి 25, వ్యాసుడు 16 సంష్కారాలను చెప్పారు. మనుస్మృతి ఈ సంస్కారాలను 12 సంస్కారాలుగా చెబుతుంది. వివాహము  ఒక సత్రంలో ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడమే వివాహము. ముహూర్త వారములు: సోమవారం నిషేధం ఆచారమే కానీ శాస్త్రం కాదు. మంగళవారము నిషేధము. మిగిలిన వారములు గ్రాహ్యమే. నక్షత్రములు: ‘మూల మైత్ర మృగ రోహిణి కరైః పౌష్ణమారుత ఘోత్సరాన్వితైః వీర్య వద్ధిరుడుద్ధిర్ముృగీ దృశాం పాణి పీడన విధిర్విధీయతే’ అని శాస్త్రం. అయితే ధనిష్ఠా, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రముల సమయంలో వివాహం శ్రేష్ఠము అని కొందరు, కాదని కొందరు చెప్పారు. అయితే నాలుగు నక్షత్రములు కూడా ఆచారంలో వున్నవి. అందువలన అశ్వినీ, రోహిణీ, మృగశిర, మఘ, ఉత్తర, హస్త, స్వాతీ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రము

తొలిఏకాదశి విశిష్టత

*తొలిఏకాదశి విశిష్టత*  ఈ రోజున ఏం చేయాలి. 12.07.2019 న హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘‘తొలి ఏకాదశిగా’’ గా పిలుస్తారు. దీనికే ‘‘శయనైకాదశి’’ అని ‘‘హరి వాసరమని‘‘ , ‘‘పేలాల పండుగ’’ అని పేరు. హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘‘తొలి ఏకాదశిగా’’ గా పిలుస్తారు. దీనికే ‘‘శయనైకాదశి’’ అని ‘‘హరి వాసరమని‘‘ , ‘‘పేలాల పండుగ’’ అని పేరు. పురాణాలను అనుసరించచి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు.. అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకుని.. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు.. ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాసదీక్షను ఆచరిస్తారు. ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళలోకంలో బలి చక్రవర్తి వద్ద ఉంది.. కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండు

స్వర్గానికి దారి

*స్వర్గారోహణ మార్గం* పాండవులు ఈ మార్గం ద్వారానే స్వర్గానికి చేరుకున్నారని ప్రతీతి. భూమి నుండి స్వర్గానికి చేరుకోవచ్చు అనడానికి ఏకైక మార్గం ఇదే. మన : బద్రీనాథ్ క్షేత్రం నుండి 5 km దూరం లో వుండే చిన్న గ్రామం. భారతదేశంలో ఆఖరి గ్రామం ఇదే. ఇక్కడి నుండే ఒకవైపు టిబెట్ ప్రారంభం అవుతుంది. ఈ గ్రామ చివరన సరస్వతి నది మనకు కన్పించే ప్రాంతం ఉంటుంది. ఇక్కడి నుండి కొంత దూరం ప్రవహించాక అలకనంద నది లో కలిసి అంతర్వాహిని గా ప్రవహిస్తుంది. ఇక్కడే సరస్వతి మాత ఆలయం కుడా ఉంటుంది. ఈ సరస్వతి నది పక్కన  భీమపుల్ అనే ఒక పెద్ద రాతిబండ ఉంటుంది. పాండవులు నదిని దాటడానికి భీముడు ఈ రాతిని ఒక వంతెన గా ఏర్పాటు చేసాడు అంటారు. ఈ రాతిమీద భీముని వేలిముద్రలు వున్నట్లు గా పెద్ద పెద్ద అచ్చులు కుడా వుంటాయి. ఈ వంతెన దాటాక స్వర్గారోహణ మార్గం ప్రారంభం అవుతుంది. మన  నుండి చట్మోలి 8 km:- మార్గ మధ్యమం లో భృగుమహర్షి ఆశ్రమం కన్పిస్తుంది. తరవాత మాతమూర్తి ఆలయం కన్పిస్తుంది. ఈవిడే నరనారాయణుల కన్నతల్లి గా కుడా చెప్తారు. ఈ ప్రాంతం 14000 అడుగుల ఎత్తులో ఉంటుంది. తర్వాత కుబేర్ మకుట్ అనే ప్రాంతం వస్తుంది. ఇక్కడే కుబేర

దయ్యాల ఆలయం

*దెయ్యాలయం* – *దయ్యాల ఆలయం.*                 ఆలయం అన గానే సాధారణంగా మనం,ఏ  దేవుడి ఆలయం అని అడుగుతాము. కానీ యెక్కడైతే దేవుడిని విగ్రహాన్ని ప్రతిష్టించి, ప్రాణ ప్రతిష్ట, ఇత్యాది కార్యములు మంత్ర పూర్వకంగా చేస్తే, అక్కడికి  దేవుడు వచ్చి నివసిస్తూ వుంటాడని, దేవుడు నివసిస్తాడు కాన “దేవాలయం” అని అంటాము. ఆలయం అనగా నివసించు ఒక భవనం.  దేవాలయం అనగా దేవుడు నివసించు భవనం.        మరి దెయ్యాలు నివసించు భవనానికి ఏమని పిలువాలి. దెయ్యాలయం అని అనాలా? నేను పొరపాటు పడలేదoడోయి. నిజమే. ఏవరి ఇంట్లోనో దయ్యం కనిపించిందని, భయపడి ఇల్లు ఖాళీ చేసి ఆ దయ్యనికి వదిలి వెళ్ళి పోయిన ఇంటిని మనం “దయ్యాల కొంప” అని అంటాము. మర్రి చెట్టు పై దయ్యం వుంటే “దయ్యాల మర్రి” అని అంటాము. మరి ఒక ఆలయం ఒకటి కట్టి  దానికి “దయ్యాలాలయం” అని అంటే వింతగా లేదు. చూద్దాం రండి.      ఆంధ్ర కర్నాటక సరిహద్దు వద్ద, హిందూపూర్ (అనంతపురం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్) నుండి       కి,మీ దూరం లో “డొడ్డబళ్లాపూర్” అనే వూరు కర్నాటక రాష్ట్రం నకు చెందినది. ఈ వూరి నుండి దేవనహళ్లి అనే వూరి మార్గం  మద్యలో బొమ్మవర సుందరేశ్వర ఆలయాన్ని దెయ్యాలు నిర్మించినాయి అని చెబు

ఏమీ చేయాలి ఏమీ చేయకూడదు ...?

మనము ఆరాధించే దేవతలే అయినా కొన్ని దేవతా విగ్రహాలు ఇంట్లో ఉంచకూడదు గృహస్థులకు మంచిది కాదు అంటే వాటికి చేయవలసిన విధి విధానం గృహస్థులు చేయలేరు, కొన్ని ఉడటం వల్ల ఏమీ చేసిన చేయక పోయినా ఇంటికి మంచిది అవి ఏంటో చూద్దాము.. 1. పూజ గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుడి ని పెట్టకూడదు ఫోటో కానీ విగ్రహం గాని ఏది పూజ గది విడిగా లేని వారు ఉంచకూడదు. 2. సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు,ఆయనే ప్రత్యేకంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి. 3.ఉగ్ర రూపంలో ఉన్న నరసింహ స్వామి ఫోటో గాని విగ్రహం కానీ ఉంచకూడదు, లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ, లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ స్వామి ఫోటో పెట్టికొని పూజ చేయవచ్చు.. 4.చైతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉండకూడదు, కృష్ణుడి విగ్రహం అవుతో ఉన్న ఫొటో గాని చిన్న పరిమాణంలో విగ్రహం కానీ ఉండవచ్చు... 5.గవ్వలు ఎందుకు పెట్టాలి పూజ గదిలో అని అడిగారు, మొదటిది చాలామంది బాగా పూజ చేసే వారు పూజ చేయలేక పోతుంటారు, అసలు కళకళ లాడే పూజ గది దుమ్ము కొట్టేస్తున్న పూజ చేయనీయదు, అలాంటి దిష్టి పూజ గదిలోకి ప్రవేశించదు గవ్వలు ఉంటే, సముద్రపు గవ్వలకు ఆ శక్తి ఉంది గవ్వలు లక్ష్మీ ద

పెళ్లికానివారు దర్శించవలసిన క్షేత్రం

🌼🌿 తిరుప్పరంకుండం.. తమిళనాడు..! సుబ్రమణ్యస్వామి..! పెళ్లి కావడం లేదు అని మదనపడే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఎన్ని చోట్ల ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా ఆ వచ్చే శుభవార్తకై కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు ఆ తల్లితండ్రులు. ఇందుకు శారీరక మానసిక బాధలు కారణం. ఇలాంటి వారు తమిళనాడులోని ఒక చోటుకు వెళితే వెంటనే పెళ్లి అవుతుందని చెబుతారు. అంతే కాకుండా ఇక్కడ వివాహం చేసుకున్న వారికి కలిగే సంతానం ఆరోగ్య వంతంగా, బుద్ధిశాలులుగా ఉంటారని నమ్ముతారు. . మధురైకు 9 కిలోమీటర్ల దూరంలో..తిరుప్పరంకుండ్రం తమిళనాడులో గల మదురై మీనాక్షి అమ్మవారి దేవాలయానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో రెండవది తిరుప్పరంకుండ్రం. ఈ క్షేత్రములో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుని కుమార్తె అయిన దేవయాని (దేవసేనా) అమ్మతో కళ్యాణం జరిగింది. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఒక్క క్షేత్రంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారు కూర్చుని దర్శనమిస్తారు. మిగతా అన్నిచోట్ల స్వామి నిలబడిన మూర్తినే చూస్తాం ఈ క్షేత్రమునకు సంబంధించిన పురాణము ఈ విధముగా ఉంది. మన బుజ్జి సుబ్రహ్

రంగులు మారే శివలింగం ధర్శించారా?

Image
ఉదయం ఎరుపు, మధ్యాహ్నం నలుపు, సాయంత్రం తెలుపు రంగులోకి మారుతున్న శివలింగం దర్శించారా???  మైసూర్ జిల్లా లో కావేరి నది ఒడ్డున తలకాడు ప్రదేశం కలదు. బెంగళూరుకు దగ్గరలోని తలకాడులోగల పంచముఖేశ్వర స్వామి ఆలయం పేరుకు ఒకటే కానీ, ఐదు ఆలయాలున్నాయి. అయిదూ శివాలయాలే. తలకాడు చాలా చిన్న గ్రామం. అయినప్పటికీ పంచముఖ ఆలయాల కారణంగా ప్రసిద్ధికెక్కింది.వీకెండ్ ట్రిప్ లకై బెంగళూరు నుండి వచ్చేవారికి ఈ ప్రదేశం తప్పక నచ్చుతుంది. బెంగళూరు నుండి 140 కి. మీ ల దూరంలో, మైసూర్ నుండి 50 కి. మీ ల దూరంలో తలకాడు ఉంది. మీరు తలకాడు లో ప్రవేశించగానే అక్కడ ప్రవహించే కావేరి నది, చుట్టూ ఉన్న మట్టిని గమనిస్తే నదీ తీరమా ? లేక బీచా ? అని అనిపిస్తుంది. తలకాడు ఐదు ప్రఖ్యాత శివాలయాలకు ప్రసిద్ధి చెందినది. అవి వైద్యనాధేశ్వర, పాతాళేశ్వర, మరుళేశ్వర, అరకేశ్వర మరియు మల్లిఖార్జుల దేవాలయాలు. బాధాకరమైన విషయం ఏమిటంటే, ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా ఇవి ఇసుకలోకి కూరుకుపోతున్నాయి. ఈ ప్రాంతంలోనే చెప్పుకోదగ్గ మరో ఆలయం - విష్ణు భగవానుడి ఆలయం. దీనిని స్థానికులు 'కీర్తినాధేశ్వర' ఆలయం పేరుతో పిలుస్తారు. ఈ రోజు మనం పాతాళేశ్వర ఆలయం విశేషాల