Posts

Showing posts from May, 2018

12000 మరణాలను చూసిన వ్యక్తి చెబుతున్న జీవిత సత్యాలు

Image
12000 మరణాలను చూసిన వ్యక్తి చెబుతున్న జీవిత సత్యాలు కాశీలో మరణిస్తే “మోక్షం” ప్రాప్తిస్తుంది అని హిందువులలో ఒక విశ్వాసం. అందుకోసం జీవిత అంత్యకాలం కాశీలో గడపడానికి వెళుతూ ఉంటారు . అటువంటి వారికీ వసతిని కల్పించే ముఖ్యమైన మూడింటిలో కాశీలాభ్  ముక్తిభవన్ ఒకటి. మిగతా రెండూ ముముక్షు భవన్, గంగాలాభ్ భవన్ . 1908లో కాశీలాభ్ ముక్తి భవన్ స్థాపించబడింది. 44 సంవత్సరాల పాటు కాశీలాభ్ ముక్తి భవన్ మేనేజరుగా పనిచేసిన  భైరవనాద్  శుక్లా ఆ  భవనం ఎదుట ఎర్రని గోడల ముందు చెక్క కుర్చీలో   కూర్చుని చెప్పిన విషయాలు ఇపుడు నేను మీ ముందు ఉంచబోతున్నాను. 1. Resolve all conflicts before you go (అంత్య కాలానికి  ముందే   క్రోధాన్ని   విడనాడు): శ్రీరాం సాగర్ అనే ఒక సంస్కృత పండితుడు ఆరుగురు  అన్నదమ్ములలో పెద్దవాడు. చిన్న  తమ్ముడు అంటే  ఇష్టం. కానీ కాలక్రమంలో ఇద్దరి మధ్య గొడవలు వచ్చి ఇంట్లో అడ్డుగా గోడ కట్టించే వరకూ వెళ్ళింది. ఆయన తన అంత్యకాలంలో కాశీలాభ్ ముక్తి భవన్  లో మూడవ నెంబరు  రూమ్ బుక్ చేసుకున్నారు. తాను ఇంకొక పదహారు రోజులలో చనిపోతాను  అని ఆయనకు ముందే  తెలుసు. 3 రోజులు  గడిచిపోయాయి. 4వ  రోజున   ఆయన  తన త

Temples within Chennai City

Chennai Temples  information

Kedarnath darshan (latest pics)

Image
Kedarnath on the opening day well decorated with Laser technology. Please forward Kedarnath photos to all your known people as it is not only difficult to visit Kedarnath but most difficult to photograph the Shivlinga

ఇంతకీ మీది ఏ స్నానం...?

Image
🔴రుషి స్నానం, 🔴దేవ స్నానం, 🔴మానవ స్నానం, 🔴రాక్షస స్నానం... ఇంతకీ మీది ఏ స్నానం...? బారెడు పొద్దెక్కినా నిద్ర లేవ‌కుండా ప‌డుకోవ‌డం ఇపుడు సిటీల‌లోనే కాదు... ప‌ల్లెటూళ్ళ‌లోనూ ఫ్యాష‌న్‌గా మారింది.  అర్థరాత్రి వ‌ర‌కు సినిమాలు, టీవీలు, ఛాటింగుల‌తో గ‌డిపేసి... ఉద‌యం ఎంత‌కీ నిద్ర‌లేవ‌రు. సూర్యుడు న‌డినెత్తిన చేరిన త‌ర్వాత స్నానం చేస్తుంటారు.  కానీ, ఇది మంచి ప‌ద్ధ‌తి కాదుంటున్నాయి శాస్త్రాలు. అస‌లు స్నానం ఎపుడు చేయాలి...?  దాన్నిబట్టి ఉండే ఫ‌లితాలు ఇవిగో...  🚿తెల్లవారుజామున 4-5 గంటల మధ్య స్నానం చేయడం అత్యుత్తమం. దీన్ని రుషిస్నానం అంటారు. 🚿5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దేవస్నానం అంటారు. ఇది మధ్యమం. 🚿 ఇక 6 నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని మానవ స్నానం అంటారు. ఇది అధమం. 🚿ఇక 7 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. ఇది అధమాతి అధమం. కాబట్టి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, రుషిస్నానం చేయడం పుణ్యప్రదం. 🚿ఇక స్నానాల్లోకెల్లా చన్నీటి స్నానం ఉత్తమమైనది.  🚿ప్రవాహ ఉదకంలో స్నానం చేయడం ఉత్తమోత్తమం.  🚿చెరువులో స్నానం మద్యమం నూతి(బావి) వద్ద స్నానం

బ్రాహ్మీ ముహూర్తము

బ్రాహ్మీ ముహూర్తము : సూర్యోదయానికి 90 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మీ ముహూర్తము అందురు.బ్రహ్మ జ్ఞానా ధ్యానములకు అనుకూల సమయం.బ్రహ్మీ అనగా సరస్వతి.మనలోని బుద్ధి ప్రభోదము చెందే కాలం కావున బ్రహ్మీముహూర్తం అని అంటారు. బ్రహ్మముహూర్తం పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు.ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు.ఒక పగలు, ఒక రాత్రిని కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంనకు 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి.సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే 'బ్రహ్మీముహూర్తం' అంటారు. అంటే రోజు మొత్తంలో 29 వది బ్రహ్మీముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ కాబట్టి దీనికి బ్రహ్మీ ముహూర్తం అనే పేరు వచ్చింది.సూర్యోదయంనకు 90 నిమిషాల ముందు కాలం. ప్రతిరోజు బహ్మీ ముహూర్తమున నిద్ర లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలి. బ్రహ్మీమూహూర్తానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతున

Temple opening pictures from Kedarnath

Image
Latest pictures of Kedarnath on the opening day of the season. You can see the laser show introduced now. *జాగృత మహాదేవుడు* జయ బాబా భోలేనాథ్ కేదారనాథ్ ని ‘జాగృత మహాదేవుడు’ అని ఎందుకు అంటారు? రెండు నిముషాల ఈ కథ మిమ్మల్ని రోమాంచితం చేస్తుంది. పూర్తిగా చదవండి- ఒక సారి ఒక శివభక్తుడు తన ఊరినుండి కేదారనాథ్ ధామానికి యాత్రకోసం బయలుదేరాడు. అప్పట్లో యాత్రాసాధనాలు, ప్రయాణ సౌకర్యాలు లేనందున, అతడు నడక ద్వారానే పయనించాడు। దారిలో ఎవరు కలిస్తే వారిని కేదారనాథ్ మార్గం అడిగేవాడు। మనసులో శివుని ధ్యానిస్తూ ఉండేవాడు। అట్లా నడుస్తూ నడుస్తూ నెలలు గడిచిపోయాయి। చివరకు ఒక రోజు అతడు కేదారధామం చేరనే చేరాడు। కేదారనాథ్ లో మందిరం ద్వారాలను ఆరు నెలలే తెరుస్తారు, ఆరు నెలలు మూసి ఉంచుతారు। అతడు మందిరం ద్వారాలు మూసేవేళ అక్కడకు చేరాడు। పూజారికి అతడు ఆర్తితో చెప్పాడు- ‘నేనెంతో దూరం నుంచి పాదయాత్ర చేస్తూ వచ్చాను। కృప ఉంచి తలుపులు తీయండి. ఈశ్వరుని దర్శించనివ్వండి’। అని. కానీ అక్కడ నియమం ఏంటంటే ఒకసారి తలుపును మూస్తే ఇక మూసినట్టే। నియమం నియమమే మరి। అతడు చాలా దుఃఖపడ్డాడు। మాటిమాటికీ శివుని స్మరించాడు. ‘ప్

51 శక్తి పీఠాల దర్శనం

51 శక్తి పీఠాల దర్శనం

తిరుపతి గంగానమ్మ అమ్మవారు మరియు కోల్హపూరి మహలక్ష్మి అమ్మవారు

Image
16.05.2018 4 O'clock .. Nija Rupa darsanam .. Tirupati Gangamma thalli 🌸*మహలక్ష్మి అమ్మవారు, కోల్హపూర్ మహరాష్ఠ్ర  *🌸 బంగారు చీరలో తిరుపతి పద్మావతి దేవి అమ్మవారు. ఎతైన ఆంజనేయస్వామి విగ్రహాలు

మాస శివరాత్రి ? ఎందుకు జరుపుకోవాలి?

Image
మాస శివరాత్రి ? ఎందుకు జరుపుకోవాలి? ఎలా జరుపుకోవాలి? వలన ఉపయోగములు *1. మాస శివరాత్రిని ఎప్పుడు జరుపుకోవాలి ?*_ ప్రతి నెల అమావాస్య ముందురోజు వచ్చే చతుర్ధశి తిధిని మాసశివరాత్రిగా జరుపుకుంటారు. అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం. శివుని జన్మ తిధిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి. _*2. మాస శివరాత్రి  ఎందుకు జరుపుకోవాలి?*_ మహాశివుడు లయ కారకుడు.  కనీనికా నాడీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారము లయానికి (మృత్యువునకు) కారకుడు  కేతువు, అమావాస్య  ముందు వచ్చే చతుర్ధసి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. _*చంద్రోమా మనస్సో జాతః*_ అనే సిద్దాంతము ప్రకారము ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడూ జీవులపై ఈ కేతు ప్రభావము ఉండటము వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూయించడము వలన జీర్ణ శక్తి మందగిస్తుంది. తద్వారా మనస్సు ప్రభావితం అవుతుంది. తద్వారా ఆయా జీవులు ఈ సమయంలో మానసికముగా సమయమును కోల్పోవడమో, చంచల స్వభావులుగా మారడమో, మనోద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమయాలలో  తమకే కాకుండా తమ సమీపములో ఉన్న ప్రజల యొక్క మనస్సు, ఆరోగ్యం, ధనం,

యంత్రములు

Image
శ్రీ యంత్ర రాజము

పితృ తర్పణము --విధానము

Image
పితృ తర్పణము --విధానము శ్రీః శ్రీమతే వేద పురుషాయ నమః పితృ దేవతలకు శ్రాద్ధం చేసినపుడు , తర్పణము కూడా అందులో భాగం గా చెయ్యాలి. దీనిని చదివి , బ్రాహ్మణుడు దొరకకున్ననూ , ఎవరికి వారు తర్పణము చేయవచ్చును తర్పణము అర్థము , అవసరము , ప్రాశస్త్యము వంటి వాటి గురించి వేరొక చోట వ్రాయుచున్నాను ) ముగ్గురు పితృ దేవతలను బ్రాహ్మణులలో ఆవాహన చేసి కూర్చోబెట్టి చేసే శ్రాద్ధాన్ని ’ పార్వణ శ్రాద్ధం ’ లేక ’ చటక శ్రాద్ధం ’ అంటారు..కొన్ని సాంప్ర దాయాలలో బ్రాహ్మణులు లేకుండా కేవలము కూర్చలలో పితృదేవతలను ఆవాహన చేస్తారు .. .తగిన కారణము వలన అది కూడ వీలు కానప్పుడు క్లుప్తముగా చేసే శ్రాద్ధాలు... దర్శ శ్రాద్ధము , ఆమ శ్రాద్ధము , హిరణ్య శ్రాద్ధము. ఆ పద్దతి ముందుగా ఇచ్చి , తదుపరి తర్పణ విధి వివరించడమయినది.. దర్శాది హిరణ్య / ఆమ శ్రాద్దం పుణ్య కాలే | దర్భేషు ఆశీనః | దర్భాన్ ధారయమాణః | ఆచమ్య , పవిత్ర పాణిః ప్రాణానాయమ్య | ఓం భూః ..ఓం భువః...ఓగ్ం సువః.. ఓం మహః.. ఓం జనః.. ఓం తపః.. ఓగ్ం సత్యం..| .....ఓం తత్సవితుర్వరేణ్యం | భర్గో దేవస్య ధీమహి | ధియో యోనః ప్రచోదయాత్ | ఓమాపోజ్యోతీ రసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ సంకల్ప

Mukthinath

Image
PM at Mukthinath, excellent darshan view of mukthinath perumal! !

శని జయంతి 15.5.2018

Image
*15.5.2018 శని జయంతి* మంగళవారం. భరణి నక్షత్రం *(వైశాఖ బహుళ అమావాస్య)* (శని జయంతి సమాచారం అవసరం, ఆసక్తి ఉన్నవారికోసం) *నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం* *ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం ||* నీలాంజన సమాభాసం = నీలవర్ణంలో భాసిల్లెడు (ప్రకాశించే) రవిపుత్రం = సూర్య దేవుని పుత్రుడైన యమాగ్రజం = యమునికి సోదరుడు ఐన ఛాయామార్తాండ సంభూతం = ఛాయాదేవి (శనీశ్వరుని తల్లి), సూర్యుల సంతానమైన తం నమామి శనైశ్చరం = ఓ శనీశ్వరా నీకు నమస్కరిస్తున్నాను *శనైశ్చరాయ* అంటే శనైః = నెమ్మదిగా చరాయ = చరించే/తిరిగేవాడు *శని దేవుడు జీవుల కర్మఫల ప్రదాత* అంటే మనకు ఎందరు దేవుళ్లు, దేవతలు ఉన్నా, మనం చేసిన పను(కర్మ)లకు అవి పుణ్యకార్యం/ మంచి పని ఐనా, పాపం/ చెడు ఐనా ఫలితాన్ని ఇచ్చేది శనిదేవుడే.  సమస్త దేవ, రాక్షస, మనుష్య &  ఇతర ప్రాణుల కర్మలకు ఫలితాన్ని ఇచ్చి, వాళ్లందరినీ  నియంత్రించేందుకు లయకారకుడైన శివుడు శనికి వక్రదృష్టి, ఇతరశక్తులనిచ్చి, కర్మఫలదాతను చేస్తాడు. వాటిసాయంతో శనీశ్వరుడు *క్రమశిక్షణ, మంచి లక్షణాలను కాపాడుతూ, చెడుని, చెడ్డవాళ్లను వారు చేసే కర్మలను అనుసరించి శిక్షించడం

పంచసరోవరాలు

Image
*పంచసరోవరాలు*  *దేవాలయాలు*     🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉       *🌷ॐ ఓం నమః శివాయ ॐ🌷* మన సంసృతి సంప్రదాయాలలో తీర్థయాత్రలకు చాలా ప్రాముఖ్యత వుంది. ప్రస్తుతం తీర్థం అంటే ఓ క్షేత్రమనే అర్థాన్నే అన్వయించుకుంటున్నాము. అయితే వేదకాలంలో తీర్థమనే పదానికి సరస్సు అర్థం కూడ ఉండేది. అలా తీర్థాలకు చేసే యాత్రలనే తీర్థయాత్రలని పిలుచుకుంటున్నాం. దేశంలో ఎన్నో సరోవరాలు ఉండగా, వాటిలో ఐదు 'పంచ సరోవరాలు' గా ప్రసిద్ధికెక్కాయి. అవి: 1. మానస సరోవరం, 2. పంపా సరోవరం, 3. పుష్కర్‌ సరోవరం, 4. నారాయణ సరోవరం, 5. బిందు సరోవరం, 1. మానస_సరోవరం సమస్త లోకాలలో మానస సరోవరం వంటి పవిత్ర సరోవరం మరొకటి లేదన్నది వాస్తవం. ఈ సరోవరం బ్రహ్మదేవుని మనస్సు నుంచి ఉద్భవించింది. అందుకే దీనిని గతంలో 'బ్రహ్మసరం' అని పిలిచేవారు. ఇది ఎన్నో పవిత్రనదులకు పుట్టినిల్లు. ఈ సరోవరం చెంతనే గంగను దివి నుంచి భువికి తెప్పించడానికి భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు. మన పురాణాలలో మానస సరోవర ప్రస్తావన అక్కడక్కడా కనిపిస్తూంటుంది. ఈ సరోవరాన్ని బ్రహ్మదేవుడు ఆదిదంపతుల కోసం సృష్టించాడని పురాణ కథనం. ఒకసారి బ్రహ్మమానస పుత్రులైన సన

తిరుమలలో మీరు వాలంటీర్ గా చేస్తారా..?

Image
తిరుమలలో మీరు వాలంటీర్ గా చేస్తారా..? అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా..? వివరాలు తెలీక బాధ పడుతున్నారా..? తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని ఎంతోమంది దర్శించుకుని తరిస్తారు. అయితే ఆ స్వామి వారి సన్నిధిలో వారం రోజులపాటు సేవ చేసే భాగ్యాన్ని కూడా కల్పిస్తోంది టీటీడీ. శ్రీవారి సన్నిధిలోని క్యూ లైన్లు, దేవాలయ పరిసరాలు తదితర చోట్ల విధులు నిర్వహించేందుకు వలంటీర్లను ఎంపిక చేస్తుంది. స్వామివారి సన్నిధిలో సేవకు ఎలా వెళ్లాలి?, మార్గదర్శకాలు ఏమిటో? తెలుసుకోండి మరి...! నెల రోజుల ముందే సమాచారమివ్వాలి..! ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. స్త్రీ, పురుష బేధం లేకుండా పదిమంది భక్తులకు తక్కువగాకుండా బృందంగా వెళ్లాలి. గ్రూపులోని సభ్యులంతా వారి పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాలను నెలరోజుల ముందుగానే టీటీడీకి పంపాలి. ఏ కులం వారైనా హిందువులందరూ శ్రీవారి సేవకు అర్హులే. హిందువుగా గుర్తించేందుకు తిరుమల నామం, తిలకం లేదా కుంకుమ లేదా చందనం బొట్టు ధరించాలి. శ్రీవారి సేవకు వచ్చే గ్రూపు లీడరు లేదా కోఆర్డినేటర్ వలంటీర్ల పూర్తి వివరాలు తిరుమల సేవా సదన్‌లో అందించాలి. వారి వయసు 18 ఏళ్లు నిండి 60