హిందువుల నమ్మకాలు

*ఆదివారం*
ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు తమలపాకు నమలడం లేదా ఆకులు జేబులో ఉంచుకోవడం చేస్తే అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.

*సోమవారం*
సోమవారం మీ ముఖాన్ని అద్దంలో ఒక సారి చూసుకుని ఇంట్లో నుండి బయటకు రావాలి. వీలైతే కోడి గుడ్డు ఆకారంలో ఉండే అద్దాన్ని ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర అమర్చుకోవాలి.

*మంగళవారం*
హనుమంతుడికి ఇష్టమైన మంగళవారం ఉదయం స్నానం చేసి, హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నోరు తీపి చేసుకోవాలి. బెల్లం తింటే మరీ మంచిది.

*బుధవారం*
బుధవారం బయటకు వెళ్లేప్పుడు పుదీనా లేదా కరివేపాకు ఆకులు నోట్లో వేసుకోవాలి. ప్రతి బుధవారం ఇలా చేస్తే ఆరోగ్యంగానూ చాలా ప్రయోజనం ఉంటుంది.

*గురువారం*
గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు కొద్దిగా జిలకర లేదా ఆవాలు నోట్లో వేసుకోవడం మంచిది. వాటిని నమల కుండా అలానే నోట్లో ఉంచుకోవాలి. గుమ్మం దాటి బయటకు వెళ్లే వరకూ అలాగే ఉంచాలి.

*శుక్రవారం*
ముఖ్యమైన పనిమీద శుక్రవారం వెళ్లాల్సి వస్తే పెరుగు తిని బయలుదేరాలని హిందూ ధర్మశాస్త్రం చెబుతోంది. అలాగే ప్రతి శుక్రవారం కనీసం రెండు టేబుల్ స్పూన్ల పెరుగు ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు తీసుకోవాలి.

*శనివారం*
అల్లంతో కలిగే ప్రయోజనాలు అందరికీ తెలుసు. ప్రతి శనివారం కొద్దిగా అ్లలం తురుము నేతితో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సిరిసంపదలు మీ దరిచేరతాయి.

*********************************
లక్ష్మీదేవి కుడిచేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు.

అందుకే
ఆ చెట్టుకు పండిన కాయను

‘శ్రీఫలము’

అని పిలుస్తారు.

సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. ●

అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది.●

మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి●●● దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. ●

మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగ పడుతుంది. ●

ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది.●

 అందుకే

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం!

త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!!

 అని
 తలుస్తాము.

దళములు దళములుగా ఉన్నవాటినే కోసి
పూజ చేస్తారు.

ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది.

 అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది.
అది మూడు,
తొమ్మిది కూడా ఉంటాయి. ●

పుష్పములను

పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి.

కానీ మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా
ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు. ◆

మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు.●

అందులో
మారేడు దళము ఒకటి.●

 మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనె
శివలింగమునకు తగిలితే
ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది.◆

 అందుకే
ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా,
పిల్లలకు ఉద్యోగములు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉన్నా●●●

 మూడు ఆకులు ఉన్న దళములను పట్టుకుని శివునికి పూజ చేసేవారు. ●

శివుడిని మారేడు దళంతో పూజ చేయగనే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట.◆

 ‘బాల్యం,
యౌవనం,
కౌమారం
ఈ మూడింటిని నీవు చూస్తావు’

అని ఆశీర్వదిస్తాడుట.◆

 కాబట్టి

ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది. ◆

శివుని మారేడు దళములతో పూజించే వ్యక్తీ మూడు గుణములకు అతీతుడు అవుతాడు.●

 మారేడు దళం శివలింగం మీద బోర్లాపడితే●●● జ్ఞానం సిద్ధిస్తుంది.

 ఇంత శక్తి కలిగినది కాబట్టే

దానికి "శ్రీసూక్తం"లో

 ‘అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే’

(అమ్మా అలక్ష్మిని= దరిద్రమును పోగొట్టెదవుగాక)

అని

చెప్తాము.

మనిషికి మూడు గుణములు,
మూడు అవస్థలు ఉంటాయి.●
 నాల్గవదానిలోకి వెళ్ళడు.
నాల్గవది తురీయము.●

 తురీయమే జ్ఞానావస్థ.◆

 అటువంటి తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడు దళముతో పూజ చేసిన వారికి వస్తుంది.◆

మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే

 మూడు కోట్లమంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే. ●

ఇంట్లో మారేడు చెట్టు ఉంటె >>
ఆ మారేడు చెట్టు క్రింద కూర్చుని ఎవరయినా జపం చేసినా పూజ చేసినా>> అపారమయిన సిద్ధి కలుగుతుంది.◆

 యోగ్యుడయిన వ్యక్తి దొరికినప్పుడు
ఆ మారేడు చెట్టుక్రింద చక్కగా శుభ్రం చేసి ఆవుపేడతో అలికి >>పీట వేసి >>ఆయనను అక్కడ కూర్చోపెట్టి >>
భోజనం పెడితే >>
అలా చేసిన వ్యక్తికి కోటిమందిని తీసుకువచ్చి ఏకకాలమునందు వంటచేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది.◆

 శాస్త్రము మనకు లఘువులు నేర్పింది.●

 మారేడు చెట్టు అంత గొప్పది.◆

మారేడు చెట్టు మీదనుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది.●


అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది.◆

 ‘మా-రేడు’

తెలుగులో
రాజు ప్రకృతి,
రేడు వికృతి. ◆

మారేడు అంటే మా రాజు. ◆

ఆ చెట్టు పరిపాలకురాలు.●
 అన్నిటినీ
ఇవ్వగలదు.◆

 ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు.◆

 అది పువ్వు పూయవలసిన అవసరం లేదు.◆

 ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా >>>
మారేడు
పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. ●

అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు.◆

అందుకే మీకు ఏది చేతనయినా కాకపోయినా >>మీ జీవితమును పండించుకోవడానికి వాసనా బలములను మీరు ఆపుకోలేకపోతే ప్రయత్నపూర్వకంగా పాపం చేయడానికి మీ అంత మీరు నిగ్రహించుకోలేకపొతే మీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి మూడు విషయములు శాస్త్రంలో చెప్పబడ్డాయి.●

 అందులో
1●మొదటిది తప్పకుండా భస్మ ధారణ చేయడం,

2● రెండవది రుద్రాక్ష మెడలో వేసుకొనుట,

3● మూడవది తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారయినా చేయుట. ●

ఈ మూడు పనులను ప్రతివ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెప్తారు.◆◆◆

Comments

Please follow, Like, Comment and share

స్త్రీ కి పర్యాయ పదాలు ఎన్నో తెలుసా?

101 గ్రామ దేవతల పేర్లు

108 శక్తి పీఠాలు:

Paka shastram పాక శాస్త్ర వివరణ. భోజనం విధులు

Homam హోమాలు ఎన్ని రకములు వాటి వివరములు

సంస్కారాలు - ముహూర్తములు

సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు

_*ఉండ్రాళ్ళతద్ది నోము గురించి తెలుసు కుందాం రండి*_

శనీశ్వరుడు గురించి తెలుసుకుందాం, శని భాదల నుండి విముక్తులం అవుదాం

వరలక్ష్మి వ్రతం