** మనం నిత్యం భోజనం చేసేటపుడు., కొన్ని అలవాట్లు మనకే తెలియక అలవాటుగా చేస్తూ వుంటాము. అవి అలవాట్లు కాదట. మన యొక్క నైజo అనగా మన గుణ గణాల ప్రతిబింబాలని పాక శాస్త్రం చెబుతూoది. చూద్దాము. మనము, మన గుణాలు ఎంత వరకు సరిపోతాయో, మనకు మనమే గమనించు కోవాలి. అలాగే ఎదుటి వారిని మనము అంచనా వేసు కోవచ్చు. భోజనం చేసేటపుడు, మన ఆహారం ఎలా తీసు కొంతున్నామో చూడండి. ఇతరుల లో గమనించండి. వారి నడవడికను, గుణ గణాలు తెలుకోనండి. *ఎవరైతే* :----- 1. చేతి వ్రేళ్ళు కలపక, విడివిగా ఆహారం తింటూ వ్రేళ్ళ మధ్య జార విడుస్తుంటారో వారి వద్ద డబ్బు నిలవదట. 2. అన్నాన్ని పిసికి పిసికి తినే వారి భార్య అతని వల్ల జీవితాంతం భాధ పడుతుందట. అతని మనస్సు క్రూరము, దయా దాక్షిణ్యాలు లేనివాడట. అలాంటి వాడికి మన ఆడకూతురును ఇవ్వ కూడదట. 3. చేతి వ్రేళ్ళకు, తినేది విడి విడి గా అతుక్కుని వుంటే వాడు దరిద్రుడట. 4. ఎవరైతే వ్రేళ్ళు మొత్తం నోట్లో పెట్టుకొని జుర్రుకుంటూ తింటారో, వారి వద్ద డబ్బు నిలవదట. పైపెచ్చు బహు పిసినారులట. 5. త...
మానవుడు జన్మించినప్పటి నుంచి మరణించే వరకు సంష్కారమయమే. సంస్కారాల వలన జన్మాంతర దోషాలు కూడా వీడిపోయి మానవ జీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది. జీవి గర్భంలో పడింది మొదలు అంత్య సంస్కారం వరకు జరిగే సంస్కారాలు లేదా కర్మలు ధర్మశాస్త్రల్లో 40 వరకు చెప్పబడ్డాయి. గౌతమ స్మృతుల్లో 40 సంష్కారాలను, అంగీరస మహర్షి 25, వ్యాసుడు 16 సంష్కారాలను చెప్పారు. మనుస్మృతి ఈ సంస్కారాలను 12 సంస్కారాలుగా చెబుతుంది. వివాహము ఒక సత్రంలో ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడమే వివాహము. ముహూర్త వారములు: సోమవారం నిషేధం ఆచారమే కానీ శాస్త్రం కాదు. మంగళవారము నిషేధము. మిగిలిన వారములు గ్రాహ్యమే. నక్షత్రములు: ‘మూల మైత్ర మృగ రోహిణి కరైః పౌష్ణమారుత ఘోత్సరాన్వితైః వీర్య వద్ధిరుడుద్ధిర్ముృగీ దృశాం పాణి పీడన విధిర్విధీయతే’ అని శాస్త్రం. అయితే ధనిష్ఠా, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రముల సమయంలో వివాహం శ్రేష్ఠము అని కొందరు, కాదని కొందరు చెప్పారు. అయితే నాలుగు నక్షత్రములు కూడా ఆచారంలో వున్నవి. అందువలన అశ్వినీ, రోహిణీ, మృగశిర, మఘ, ఉత్తర, హస్త, స్వాతీ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, ర...
మనము ఆరాధించే దేవతలే అయినా కొన్ని దేవతా విగ్రహాలు ఇంట్లో ఉంచకూడదు గృహస్థులకు మంచిది కాదు అంటే వాటికి చేయవలసిన విధి విధానం గృహస్థులు చేయలేరు, కొన్ని ఉడటం వల్ల ఏమీ చేసిన చేయక పోయినా ఇంటికి మంచిది అవి ఏంటో చూద్దాము.. 1. పూజ గది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుడి ని పెట్టకూడదు ఫోటో కానీ విగ్రహం గాని ఏది పూజ గది విడిగా లేని వారు ఉంచకూడదు. 2. సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు,ఆయనే ప్రత్యేకంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి. 3.ఉగ్ర రూపంలో ఉన్న నరసింహ స్వామి ఫోటో గాని విగ్రహం కానీ ఉంచకూడదు, లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ, లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ స్వామి ఫోటో పెట్టికొని పూజ చేయవచ్చు.. 4.చైతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉండకూడదు, కృష్ణుడి విగ్రహం అవుతో ఉన్న ఫొటో గాని చిన్న పరిమాణంలో విగ్రహం కానీ ఉండవచ్చు... 5.గవ్వలు ఎందుకు పెట్టాలి పూజ గదిలో అని అడిగారు, మొదటిది చాలామంది బాగా పూజ చేసే వారు పూజ చేయలేక పోతుంటారు, అసలు కళకళ లాడే పూజ గది దుమ్ము కొట్టేస్తున్న పూజ చేయనీయదు, అలాంటి దిష్టి పూజ గదిలోకి ప్రవేశించదు గవ్వలు ఉంటే, సముద్రపు గవ్వలకు ఆ శక్తి ఉంది గవ్వలు లక్ష్మీ ద...
పరమేశ్వరుడు పరాశక్తితో వీటన్నింటా సన్నిధి చేసి ఉంటాడు. వీటిని స్మరించినా, విన్నా భక్తులకు పాపాలు తొలగి ముక్తి లభిస్తుంది. అష్టోత్తర శతనామాలను జపించినా, పుస్తకాన్ని ఇంట్లో ఉంచుకున్నా దుష్టగ్రహ పీడలన్నీ తొలగిపోతాయి. శ్రాధ్ధ కాల౦లో వీటిని స్మరి౦చినయెడల పితృదేవతలు సంతృప్తి చెందుతారు. ఇవి సాక్షాత్తు ముక్తి క్షేత్రాలు. 1. వారణాసిలో విశాలాక్షి 2. ముఖనివాసం లో గౌరి ౩. నైవిశం లో లింగధారిణి 4. ప్రయాగలో లలిత 5. గంధమాదనం మీద కౌముకి 6. మానస క్షేత్రం లో కుముద 7. దక్షిణ క్షేత్రం లో విశ్వకామ 8. ఉత్తర క్షేత్రం లో విశ్వకామప్రరూపిణీ 9. గోమంతం లో గోమతి 10. మందరం లో కామచారిణీ 11. చైత్రరథం లో మదోత్కట 12. హస్తినాపురం లో జయంతి 13. కన్యాకుబ్జం లో గౌరి 14. మలయాచలం పై రంభ 15. ఏకామ్ర పీఠం లో కీర్తిమతి 16. విశ్వక్షేత్రం లో విశ్వేశ్వరి 17. పుష్కర క్షేత్రం లో పురుహూతిక 18. కేదారం లో సన్మార్గదాయిని 19. హిమాలయం లో మంద 20. గోకర్ణం లో భద్రకర్ణిక 21. స్థానేశ్వరం లో భవాని 22. బిల్వక్షేత్రం లో బిల్వపత్రిక 23. శ్రీశైలం లో మాధవి 24. భద్రేశ్వరం భద్ర 25. వరాహాశైలం మీద జయ 26. కమలాయం లో కమల 27. ర...
రేపు కార్తీక పొర్ణమి ఏమి చేయాలి,దీపం ఏ దిక్కు ఉంచాలి,ఉపవాసము ఎలా చేయాలి.. రేపు కార్తీక పొర్ణమి సాయంత్రం 7 లోపులో పూర్తి అవుతుంది ఆ లోపులో ఇలా చేయండి.. కార్తీకమాసంలో ఉన్నవన్నీ పర్వదినాలే. అయితే ఈ పర్వదినాలన్నింటిలోకీ పర్వదినం కార్తీక పున్నమి అని చెప్పవలసి ఉంటుంది. మాసంలో మిగిలిన అన్ని రోజులూ చేసే స్నానం దానం దీపం జపం ఉపవాసం వంటివన్నీ ఒక ఎత్తు. పున్నమినాడు చేసేవన్నీ ఒక ఎత్తు. అంతటి విశిష్టత ఉంది కార్తీక పున్నమికి. కార్తీక పౌర్ణమినాడు తెల్లవారు జామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుంటారు. రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు. కొందరు దీపాలను అరటిదొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు. మన గృహం తులసికోట ముందు మంచిది అని శాస్త్ర వచనం.. దేవాలయాల్లో సహస్ర...
Comments
Post a Comment