మానవుడు జన్మించినప్పటి నుంచి మరణించే వరకు సంష్కారమయమే. సంస్కారాల వలన జన్మాంతర దోషాలు కూడా వీడిపోయి మానవ జీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది. జీవి గర్భంలో పడింది మొదలు అంత్య సంస్కారం వరకు జరిగే సంస్కారాలు లేదా కర్మలు ధర్మశాస్త్రల్లో 40 వరకు చెప్పబడ్డాయి. గౌతమ స్మృతుల్లో 40 సంష్కారాలను, అంగీరస మహర్షి 25, వ్యాసుడు 16 సంష్కారాలను చెప్పారు. మనుస్మృతి ఈ సంస్కారాలను 12 సంస్కారాలుగా చెబుతుంది. వివాహము ఒక సత్రంలో ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడమే వివాహము. ముహూర్త వారములు: సోమవారం నిషేధం ఆచారమే కానీ శాస్త్రం కాదు. మంగళవారము నిషేధము. మిగిలిన వారములు గ్రాహ్యమే. నక్షత్రములు: ‘మూల మైత్ర మృగ రోహిణి కరైః పౌష్ణమారుత ఘోత్సరాన్వితైః వీర్య వద్ధిరుడుద్ధిర్ముృగీ దృశాం పాణి పీడన విధిర్విధీయతే’ అని శాస్త్రం. అయితే ధనిష్ఠా, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రముల సమయంలో వివాహం శ్రేష్ఠము అని కొందరు, కాదని కొందరు చెప్పారు. అయితే నాలుగు నక్షత్రములు కూడా ఆచారంలో వున్నవి. అందువలన అశ్వినీ, రోహిణీ, మృగశిర, మఘ, ఉత్తర, హస్త, స్వాతీ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, ర...
పరమేశ్వరుడు పరాశక్తితో వీటన్నింటా సన్నిధి చేసి ఉంటాడు. వీటిని స్మరించినా, విన్నా భక్తులకు పాపాలు తొలగి ముక్తి లభిస్తుంది. అష్టోత్తర శతనామాలను జపించినా, పుస్తకాన్ని ఇంట్లో ఉంచుకున్నా దుష్టగ్రహ పీడలన్నీ తొలగిపోతాయి. శ్రాధ్ధ కాల౦లో వీటిని స్మరి౦చినయెడల పితృదేవతలు సంతృప్తి చెందుతారు. ఇవి సాక్షాత్తు ముక్తి క్షేత్రాలు. 1. వారణాసిలో విశాలాక్షి 2. ముఖనివాసం లో గౌరి ౩. నైవిశం లో లింగధారిణి 4. ప్రయాగలో లలిత 5. గంధమాదనం మీద కౌముకి 6. మానస క్షేత్రం లో కుముద 7. దక్షిణ క్షేత్రం లో విశ్వకామ 8. ఉత్తర క్షేత్రం లో విశ్వకామప్రరూపిణీ 9. గోమంతం లో గోమతి 10. మందరం లో కామచారిణీ 11. చైత్రరథం లో మదోత్కట 12. హస్తినాపురం లో జయంతి 13. కన్యాకుబ్జం లో గౌరి 14. మలయాచలం పై రంభ 15. ఏకామ్ర పీఠం లో కీర్తిమతి 16. విశ్వక్షేత్రం లో విశ్వేశ్వరి 17. పుష్కర క్షేత్రం లో పురుహూతిక 18. కేదారం లో సన్మార్గదాయిని 19. హిమాలయం లో మంద 20. గోకర్ణం లో భద్రకర్ణిక 21. స్థానేశ్వరం లో భవాని 22. బిల్వక్షేత్రం లో బిల్వపత్రిక 23. శ్రీశైలం లో మాధవి 24. భద్రేశ్వరం భద్ర 25. వరాహాశైలం మీద జయ 26. కమలాయం లో కమల 27. ర...
*15.5.2018 శని జయంతి* మంగళవారం. భరణి నక్షత్రం *(వైశాఖ బహుళ అమావాస్య)* (శని జయంతి సమాచారం అవసరం, ఆసక్తి ఉన్నవారికోసం) *నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం* *ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం ||* నీలాంజన సమాభాసం = నీలవర్ణంలో భాసిల్లెడు (ప్రకాశించే) రవిపుత్రం = సూర్య దేవుని పుత్రుడైన యమాగ్రజం = యమునికి సోదరుడు ఐన ఛాయామార్తాండ సంభూతం = ఛాయాదేవి (శనీశ్వరుని తల్లి), సూర్యుల సంతానమైన తం నమామి శనైశ్చరం = ఓ శనీశ్వరా నీకు నమస్కరిస్తున్నాను *శనైశ్చరాయ* అంటే శనైః = నెమ్మదిగా చరాయ = చరించే/తిరిగేవాడు *శని దేవుడు జీవుల కర్మఫల ప్రదాత* అంటే మనకు ఎందరు దేవుళ్లు, దేవతలు ఉన్నా, మనం చేసిన పను(కర్మ)లకు అవి పుణ్యకార్యం/ మంచి పని ఐనా, పాపం/ చెడు ఐనా ఫలితాన్ని ఇచ్చేది శనిదేవుడే. సమస్త దేవ, రాక్షస, మనుష్య & ఇతర ప్రాణుల కర్మలకు ఫలితాన్ని ఇచ్చి, వాళ్లందరినీ నియంత్రించేందుకు లయకారకుడైన శివుడు శనికి వక్రదృష్టి, ఇతరశక్తులనిచ్చి, కర్మఫలదాతను చేస్తాడు. వాటిసాయంతో శనీశ్వరుడు *క్రమశిక్షణ, మంచి లక్షణాలను కాపాడుతూ, చెడుని, చెడ్డవాళ్లను వారు చేసే కర్మలను అనుసరి...
ద్రాక్షారామ చుట్టుపక్కల అనేక శివాలయాలు దేవీమందిరాలు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే. ఆ ఆలయాలన్నిటిని ఆకాశమార్గాన చూస్తే అన్ని కలిపి ఒక పద్మాకారం లో వుంటాయి. ఈ ఆలయాల గురించి బహుళ ప్రాచుర్యం లేనందున చాల మందికి ఈ ఆలయాల గురించిన అవగాహన లేదు. విశేషమేమిటంటే, ప్రతి వ్యక్తి 27 నక్షత్రాలు లో ఉన్న 108 పాదాలలో ఏదో ఒక దానిలో జన్మిస్తారు. ప్రతి నక్షత్రానికి దానికి సంబంధించిన ప్రతి పాదానికి సంబంధించి ప్రత్యేకమైన ఆలయం ఉంటుంది గ్రహదోష నివారణ కోసం అభిషేకాలు చేయ దలుచుకున్న వారికి ఆ ప్రత్యేకమైన ఆలయంలో మొదట నామ నక్షత్రము, లేదా జన్మనక్షత్రానికి తరువాత రాశికి సంబంధించిన లింగ ఆరాధన చేసి చివరకు ద్రాక్షారామం దర్శించుకుంటే ఫలితం ఉంటుందట . మేషరాశి నుండి మీనరాశి వరకు అదే క్రమంలో ఆరాధించ వలసిన ఆలయాల సమాచారం. మేష రాశి మేషరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామం భీమేశ్వర స్వామి వారి ఆలయానికి తూర్పున విలాసగంగావరంలో వుంది. అశ్విని నక్షత్రం పాదం ----------స్థలం -------- దేవీ దేవతల నామాలు మొదటి---------బ్రహ్మపురి-------శ్రీశ్రీశ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి రెండవ -------...
** మనం నిత్యం భోజనం చేసేటపుడు., కొన్ని అలవాట్లు మనకే తెలియక అలవాటుగా చేస్తూ వుంటాము. అవి అలవాట్లు కాదట. మన యొక్క నైజo అనగా మన గుణ గణాల ప్రతిబింబాలని పాక శాస్త్రం చెబుతూoది. చూద్దాము. మనము, మన గుణాలు ఎంత వరకు సరిపోతాయో, మనకు మనమే గమనించు కోవాలి. అలాగే ఎదుటి వారిని మనము అంచనా వేసు కోవచ్చు. భోజనం చేసేటపుడు, మన ఆహారం ఎలా తీసు కొంతున్నామో చూడండి. ఇతరుల లో గమనించండి. వారి నడవడికను, గుణ గణాలు తెలుకోనండి. *ఎవరైతే* :----- 1. చేతి వ్రేళ్ళు కలపక, విడివిగా ఆహారం తింటూ వ్రేళ్ళ మధ్య జార విడుస్తుంటారో వారి వద్ద డబ్బు నిలవదట. 2. అన్నాన్ని పిసికి పిసికి తినే వారి భార్య అతని వల్ల జీవితాంతం భాధ పడుతుందట. అతని మనస్సు క్రూరము, దయా దాక్షిణ్యాలు లేనివాడట. అలాంటి వాడికి మన ఆడకూతురును ఇవ్వ కూడదట. 3. చేతి వ్రేళ్ళకు, తినేది విడి విడి గా అతుక్కుని వుంటే వాడు దరిద్రుడట. 4. ఎవరైతే వ్రేళ్ళు మొత్తం నోట్లో పెట్టుకొని జుర్రుకుంటూ తింటారో, వారి వద్ద డబ్బు నిలవదట. పైపెచ్చు బహు పిసినారులట. 5. త...
💐శ్రీ నవగ్రహ మంత్రములు..💐 మానవుని యొక్క దైనందిన జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉం టాయి. జ్యోతిష్యం పై నమ్మకం ఉన్నవారు సమస్యకు కారణం తెలిసిన వెంటనే సంబంధిత గ్రహానికి పూజించి ఆ గ్రహానుగ్రహం పొంది తత్సంబంధమైన భాదల నుండి విముక్తి పొందుతుంటారు. జ్యోతిష్య జ్ఞానం లేనివారు కూడా వారికి కలుగుచున్న కష్టాలకు కారణం అగు గ్రహం తెలుసుకొని ఆ గ్రహాని కి శాంతి మార్గములు చేసుకొనిన గ్రహ భాదల నుండి విముక్తి పొందుతారు. సూర్యుడు:💐 ఎవరి జాతకంలో అయితే రవి బలహీనంగా ఉంటాడో వారికి అనారోగ్యము, అధికారుల నుండి వేధింపులు, తండ్రి లేదా పుత్రుల నుండి వ్యతిరేకత, నేత్ర, గుండె సంబంధిత వ్యాధులు, తండ్రి తరుపు బంధువులతో పడకపోవుట, ఏదైనా సాధించాలనే పట్టుదల లేకపోవుట, ఆత్మ విశ్వాసం లేకపోవుట వంటి సమస్యలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనేవారు సూర్య గ్రహ అనుగ్రహం కొరకు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొనుట, ఆదిత్య హృదయం పారాయణం, గోధుమ లేదా గోధుమలతో తయా రుచేసిన ఆహారపదార్థ ములు దానం చేయుట. తండ్రి గారిని లేదా తండ్రితో సమానమైన వారిని గౌరవించుట వలన రవి గ్రహదోషము తొలగిపోయి అభివృద్ధి కలుగుతుంది. చంద్రుడు:💐 చంద్రుడు జా...
Comments
Post a Comment